Bajaj Auto : బజాజ్ పల్సర్ పై రూ.3,456.. అవెంజర్ పై రూ. 5,000 పెంచిన బజాజ్.
బజాజ్ ఆటో తమ కంపెనీ బైకుల ధరలను పెంచింది. అవెంజర్, ఐఎన్ఎస్ విక్రంతోపాటు పల్సర్ లోని అన్ని మోడల్ బైకుల ధరలను పెంచారు. ధరలు రూ.2,000 నుంచి రూ.5,000 మధ్య పెరిగాయి.
- kunduru Vinod
- Published On : July 11, 2021 / 04:38 PM IST
Bajaj Auto
Bajaj Auto : బజాజ్ ఆటో తన పల్సర్, అవెంజర్, డామినేటర్ బైకుల ధరలను పెంచింది.
పల్సర్ 180 డాగర్ ఎడిషన్ పై రూ.3,456 గతనంలో దీని ధర. 1,09,907 పెరిగిన తర్వాత రూ.1,13,363 కి పెరిగింది.
పల్సర్ ఎన్ఎస్ 160 ధర రూ.2,000 పెరిగింది. ప్రస్తుతం దీని ఎక్స్ షోరూన్ ధర రూ.1.12 లక్షలుగా ఉంది.
బజాజ్ ఐఎన్ఎస్ 200 ధరను రూ .4,000 పెంచారు. పెరిగిన తర్వాత ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర రూ.1.35 లక్షలుగా ఉంది.
ఆర్ఎస్ 200పై 5,000 పెంచారు. పెరిగిన తర్వాత ఎక్స్ షోరూమ్ ధర రూ. రూ .1.57 లక్షలకు చేరింది.
అవెంజర్ స్ట్రీట్ 160పై రూ. 3,000 పెరిగింది. పెరిగిన తర్వాత ఈ బైక్ ఎక్స్ షోరూమ్ ధర 1.55 లక్షలుగా ఉంది.
అవెంజర్ క్రూయిస్ 220పై రూ.5,000 పెంచారు. ప్రస్తుతం ఈ బైక్ ధర రూ .1.31 లక్షలకు చేరింది. కాగా ఈ ధరలన్నీ ఎక్స్ షోరూమ్ ఢిల్లీవీ.
