Telangana
corona cases in Telangana : తెలంగాణలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టాయి. రాష్ట్రంలో కొత్తగా 257 కరోనా కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు ఆదివారం (ఆగస్టు 29, 2021) రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 6,57,376కు చేరాయి.
వైరస్ నుంచి కోలుకుని కొత్తగా 409 మంది డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు మొత్తం 6,47,594 మంది బాధితులు కోలుకుని సంపూర్ణ ఆరోగ్యవంతులయ్యారు. 24 గంటల్లో వైరస్ బారినపడి ఒకరు మృతి చెందగా, రాష్ట్రంలో మొత్తం మృతుల సంఖ్య 3,870కు చేరింది.
ప్రస్తుతం రాష్ట్రంలో 5,912 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.51శాతం, మరణాల రేటు 0.58శాతంగా ఉంది. ఇవాళ ఒకే రోజు 58,335 కరోనా పరీక్షలు చేశారు. తాజాగా నమోదైన కేసుల్లో అత్యధికంగా జీహెచ్ఎంసీలో 87 కేసులు నమోదయ్యాయి.