Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్.. అలా చేయకుంటే రేషన్ కట్..! హెచ్చరికలు జారీ..
Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ...
Ration card
Ration Card : రేషన్ కార్డు దారులకు బిగ్ షాకింగ్ న్యూస్. రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కీలక ప్రకటన చేసింది. వచ్చే ఏడాది ప్రారంభం నుంచి వాళ్లందరికీ రేషన్ కోటా ఉండదని హెచ్చరించింది.
Also Read : TV Price Hike : టీవీ కొనాలంటే ఇప్పుడే కొనుక్కోండి..! వచ్చే ఏడాది నుంచి భారీగా పెరగనున్న ధరలు.. ఎందుకంటే?
రేషన్ కార్డుదారులు ఈనెల 31వ తేదీలోపు ఈ-కేవైసీ పూర్తి చేసుకోవాలని రాష్ట్ర పౌరసరఫరాలశాఖ ప్రకటించింది. గడువులోపు ఈకేవైసీ చేయించుకోని వారందరికీ రేషన్ కోటా ఉండదని అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ఇటు రేషన్ డీలర్లు, అటు రేషన్ కార్డుదారుల్లో ఆందోళన మొదలైంది.
రేషన్ కార్డు దారులందరికీ ఈ-కేవైసీ తప్పనిసరి చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రక్రియ పూర్తి కాని యూనిట్లకు ఈకేవైసీ పూర్తి చేయకుంటే రేషన్ కోటా నిలిపివేస్తామని ఇప్పటికే అధికారులు పలుమార్లు హెచ్చరించినా కొంత మంది రేషన్ కార్డుదారులు నిర్లక్ష్యం వీడటం లేదు. రేషన్ కార్డుల్లో పేర్లు ఉన్న సభ్యులందరూ సమీపంలోని రేషన్ దుకాణాలకు వెళ్లి ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు వేసి ఆప్డేట్ చేయించు కోవాలి. రేషన్ కార్డు సభ్యులు ఈ-కేవైసీ చేసుకుంటేనే రేషన్ అందిస్తామని, లేదంటే వారందరికీ రేషన్ ఆపివేస్తామని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీంతో రేషన్ కార్డుల వినియోగ దారులు ఆందోళన చెందుతున్నారు.
మరోవైపు.. ఈ-పాస్ యంత్రంలో బయోమెట్రిక్ వేలిముద్రలు కొందరివి నమోదు కావడం లేదని ఫిర్యాదులు వస్తున్నాయి. ఈ-పాస్ యంత్రంలో నమోదు కాకుంటే తమ తప్పు ఎలా అవుతుందని ప్రశ్నిస్తున్నారు. డిసెంబర్ 31తో కాకుండా మరింత పెంచాలని రేషన్ కార్డుదారులు విజ్ఞప్తి చేస్తున్నారు.
రెండేండ్లుగా ఈ-కేవైసీ ప్రక్రియ కొనసాగుతున్నా వినియోగదారులు పూర్తి స్థాయిలో అప్డేట్ చేసుకోవడం లేదు. మరోవైపు రాష్ట్రంలో ఇటీవల మంజూరు చేసిన రేషన్ కార్డుదారులకు ఇంకా సంక్షేమ పథకాలను మంజూరు చేయడం లేదని లబ్దిదారులు వాపోతున్నారు. పాత రేషన్ కార్డు లబ్దిదారులకు సన్నబియ్యంతో పాటు వంటగ్యాస్, గృహజ్యోతి, ఉచిత కరెంట్ అందిస్తున్నారు. అయితే, కొత్త కార్డులు పొందిన వారికి మాత్రం ఈ పథకాలు అందడం లేదు. కొత్త రేషన్ కార్డుదారులకు కూడా ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలను అందించేలా చూడాలని కోరుతున్నారు.
