Akbaruddin Owaisi : బీఆర్ఎస్, కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని గెలిపించలేకపోయాయి : అక్బరుద్దీన్ ఓవైసీ

పాతబస్తీ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు విడుదల చేయాలన్నారు.

  • Updated on- December 16, 2023 / 02:36 PM IST

Akbaruddin Owaisi

Akbaruddin Owaisi : ముస్లింల అభివృద్ధికి పార్టీలు ప్రాధాన్యత ఇవ్వడం లేదని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ముస్లిం అభ్యర్థిని గెలిపించలేకపోయాయని అన్నారు. ముస్లింలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఈ మేరకు శనివారం ఆయన అసెంబ్లీలో మాట్లాడారు.

మదర్సా బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. పాతబస్తీ అభివృద్ధిలో ప్రభుత్వానికి సహకరిస్తామని చెప్పారు. మైనారిటీ విద్యార్థుల స్కాలర్ షిప్ లు విడుదల చేయాలన్నారు. పాతబస్తీ అభివృద్ధిపై సీఎం రివ్యూ మీటింగ్ నిర్వహించాలన్నారు. డీఎస్సీలో ఉర్దూ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

Harish Rao : కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం బీఆర్ఎస్ : హరీశ్ రావు