High Court : గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు.. మళ్లీ నిర్వహించాలని ఆదేశం, తీర్పు కాపీలో సంచలన అంశాలు

పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైందని పేర్కొంది.

High Court : గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు.. మళ్లీ నిర్వహించాలని ఆదేశం, తీర్పు కాపీలో సంచలన అంశాలు

Group 1 Exam Cancel

High Court Cancel Group 1 Exam : తెలంగాణ హైకోర్టు గ్రూప్ 1 పరీక్షను రద్దు చేస్తూ తీర్పు వెలువరించింది. గ్రూప్ 1 పరీక్ష రద్దు చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పు కాపీలో సంచలన అంశాలు వెల్లడయ్యాయి. గ్రూప్ 1 పరీక్ష రద్దుకు అభ్యర్థుల బయోమెట్రిక్ తీసుకోకపోవడమే ప్రధాన కారణంగా హైకోర్టు చూపింది. నోటిఫికేషన్ లో ఇచ్చిన ప్రతి నిబంధనను తప్పకుండా పాటించాల్సిందిగా టీఎస్పీఎస్సీకి హైకోర్టు ఆదేశించింది.

జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను గైడ్ లైన్స్ ప్రకారం నిర్వహించలేదని హైకోర్టు అభిప్రాయం పడింది. గ్రూప్ 1 పరీక్షను మరోసారి నిర్వహించి నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని నిబంధనలు పాటించాలని హైకోర్టు ఆదేశించింది. బయోమెట్రిక్ తో పాటు నోటిఫికేషన్ లో ఇచ్చిన అన్ని సూచనలను తప్పకుండా పాటించాలని ఆదేశాలు జారీ చేసింది.

YS Sharmila : స్వరాష్ట్రంలో పెద్ద కొలువులేవి? ఒక్కరికీ ఉద్యోగం దక్కకలేదు : వైఎస్ షర్మిల

పరీక్ష నిర్వహణలో టీఎస్పీఎస్సీ తగిన జాగ్రత్తలు తీసుకోలేదని హైకోర్టు తెలిపింది. అభ్యర్థుల డేటాను సేకరించడంలోనూ టీఎస్పీఎస్సీ విఫలమైందని పేర్కొంది. గ్రూప్ 1 పరీక్ష అభ్యర్థులకు ఎంత ప్రాముఖ్యమో తెలిసి కూడా టీఎస్పీఎస్సీ నిర్లక్ష్యం వహించిందని తెలిపింది. టీఎస్పీఎస్సీ సమర్పించిన కౌంటర్ పై హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.

పరీక్షకు హాజరైన అభ్యర్థుల సంఖ్యను సైతం టీఎస్పీఎస్సీ తప్పుగా చూపించిందని హైకోర్టు పేర్కొంది. జూన్ 28న 2,33,506 అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారని టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ ఇచ్చిందని వెల్లడించింది. కానీ, కౌంటర్ లో మాత్రం 2, 33, 248 మంది అభ్యర్థులు పరీక్షకు హాజరైనట్లు టీఎస్పీఎస్సీ తెలిపిందని పేర్కొంది.