దేవుడా.. ఎంత డేంజర్ ఉన్నాడు..! ఓటీటీలో ఆ క్రైమ్ సినిమా చూసి.. మీర్ పేట్ మాధవి కేసులో సంచలనం
మీర్ పేట మాధవి హత్య కేసులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఓటీటీలో మళయాళం సినిమా చూసి గురుమూర్తి మాధవి హత్యకు ప్లాన్ చేసినట్లు..

Meerpet Madhavi case
Meerpet Madhavi case: మీర్ పేట మహిళ హత్యకేసు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మాజీ జవాన్ గురుమూర్తి తన భార్య వెంటమాధవిని హత్యచేసి ఎలాంటి ఆధారాలు దొరక్కుండా జాగ్రత్తపడ్డాడు. అయితే, పోలీసులు విచారణలో మాధవిని తానే హత్యచేసినట్లు గురుమూర్తి ఒప్పుకున్నప్పటికీ పోలీసులకు ఎలాంటి ఆధారాలు లభ్యంకాలేదు. ఇంట్లోనే తన భార్యను హత్యచేశానని, అనంతరం ఆమె మృతదేహాన్ని ముక్కలుముక్కలు చేసి, ఎముకలను కాల్చి పొడిచేసి బయటపడేసినట్లు గురుమూర్తి పోలీసుల విచారణలో చెప్పగా.. పోలీసులు గురుమూర్తి నివాసం ఉంటున్న ఇంట్లో అణువణువు తనిఖీ చేశారు. అయితే, ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇటీవల మరోసారి గురుమూర్తి నివాసంలో లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి దర్యాప్తు బృందం తనిఖీ చేసి ఎట్టకేలకు ఆధారాలను సేకరించారు. ఆ ఆధారాలను డీఎన్ఏ రిపోర్టుకు పంపించారు. తాజాగా ఈ కేసులో మరో సంచలన విషయం వెలుగులోకి వచ్చింది.
Also Read: మీర్పేట్ మాధవి కేసులో మాజీ జవాన్ను పట్టించిన గ్యాస్స్టవ్
గురుమూర్తి తన భార్యను మళయాళం సినిమా స్ఫూర్తితో హత్యకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెలుగులోకి వచ్చింది. ఓటీటీలో సూక్ష్మదర్శిని అనే మళయాళం సినిమాను గురుమూర్తి పలుసార్లు చూసినట్లు, ఆ సినిమా ఆధారంగా భార్య హత్యకు కుట్ర చేసినట్లు తెలిసింది. మాధవిని హత్యచేసిన తరువాత యాసిడ్, రసాయనాలతో ఆమె శరీర భాగాలను కాల్చి ముద్ద చేశాడు. ఆ తరువాత దుర్వాసన రాకుండా స్ప్రే కెమికల్స్ వాడినట్లు పోలీసులు భావిస్తున్నారు. నిందితుడి చేతికి కాలిన గాయాన్ని పోలీసులు గుర్తించారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును హత్యకేసుగా పోలీసులు నిర్ధారణకు వచ్చారు. దీంతో మాధవి మిస్సింగ్ కేసును హత్యకేసుగా ఇవాళ పోలీసులు ప్రకటించే అవకాశం ఉంది. డీఏఎన్ఏ రిపోర్టు రాగానే గురుమూర్తిపై హత్యకేసును నమోదు చేయనున్నారు పోలీసులు.
Also Read: అడవిలో డబ్బుల డంప్ దొరికింది.. నేను ఒక్కడినే తీసుకుంటే మంచిది కాదని వీడు ఏం చేశాడో చూడండి..
గురుమూర్తి తన భార్యను హత్యచేసిన తరువాత ముక్కలు ముక్కలు చేసినట్లు పోలీసుల విచారణలో తెలిపాడు. అయితే, ఇందుకు సంబంధించి ఒక్క పీస్ కూడా దొరక్కుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నాడు. సైంటిఫిక్ ఆధారాలతో పోలీసులు కేసు ఛేదించారు. త్వరలో న్యాయమూర్తి ముందు గురుమూర్తిని పోలీసులు హాజరపర్చనున్నారు. హత్యకేసుతో పాటు ఎవిడెన్స్ ట్యాంపర్ సెక్షన్లు జత చేయనున్నారు.