Nagarjuna : రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసిన నాగార్జున దంపతులు
అక్కినేని నాగార్జున, అమల దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. మర్యాదపూర్వకంగా వీరు కలిసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
- Lakshmi 10tv
- Published On : December 30, 2023 / 12:37 PM IST
Nagarjuna
Nagarjuna : ప్రముఖ నటుడు నాగార్జున, అమల దంపతులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసారు. రేవంత్ రెడ్డి నివాసంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.
Bubble Gum : కొడుకు ఫస్ట్ సినిమాలో అతిధి పాత్రల్లో నటించడానికి సుమ ఎవర్ని తీసుకొచ్చిందో తెలుసా ?
నాగార్జున, అమల దంపతులు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్ రెడ్డికి శుభాకాంక్షలు చెప్పారు. కాసేపు రేవంత్ రెడ్డితో ముచ్చటించారు. రేవంత్ రెడ్డిని కేవలం మర్యాద పూర్వకంగా కలిసినట్లు తెలుస్తోంది.
రేవంత్ రెడ్డి సీఎం అయ్యాక అనేకమంది సినీ సెలబ్రిటీలు వ్యక్తిగతంగా కలిసి అభినందనలు చెబుతున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి కూడా రేవంత్ రెడ్డిని కలిసారు. కాగా రేవంత్ రెడ్డితో సినీ పరిశ్రమ గురించి మాట్లాడాలని పలువురు సినీ పెద్దలు భావిస్తున్నట్లు సమాచారం.
