డాక్టర్ హుస్సేన్ ఎక్కడ ?
doctor hussein kidnap mystery : రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన డాక్టర్ హుస్సేన్ కిడ్నాప్ కేసు మిస్టరీగా మారింది. దాదాపు 16 గంటలు గడిచినా..ఇప్పటి వరకూ ఆయన ఆచూకీ లభించకపోవడం కలకలం రేపుతోంది. పట్టపగలు…అందరూ చూస్తుండగానే..కిడ్నాప్ చేసి..ఆయన కారులోనే బలవంతంగా తీసుకెళ్లడం సంచలనంగా మారింది.
కిడ్నాప్కు గురైన డాక్టర్ హుస్సేన్…కిస్మత్పూర్ ప్రాంతంలోని ప్రెస్టేజ్ విల్లాలో నివసిస్తున్నారు. అదే ప్రాంతంలోని ఎక్సైజ్ పోలీస్ అకాడమీ పక్క కాలనీలో ఓ అపార్ట్మెంట్ నిర్మిస్తున్నారు. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో పనులు పరిశీలించేందుకు డ్రైవర్తో కలిసి అక్కడికి వెళ్లారు. హుస్సెన్ అక్కడికి చేరుకున్న కాసేపటికి…బురఖా వేసుకున్న ఓ ఆరుగురు వ్యక్తులు అపార్ట్మెంట్ ప్రాంతానికి చేరుకున్నారు.
రెండవ అంతస్తులో కార్మికులతో మాట్లాడుతున్న డాక్టర్ను బంధించి బలవంతంగా ఆయన కారులోనే తీసుకెళ్లారు. వెంటనే ఈ విషయాన్ని స్పాట్లో ఉన్న డ్రైవర్, కార్మికులు..డాక్టర్ కుటుంబసభ్యులకు తెలిపారు. కుటుంబసభ్యులు 100 ద్వారా పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కేసు నమోదు చేసుకున్న పోలీసులు..డాక్టర్ కిడ్నాప్కు గురైన ప్రదేశానికి చేరుకున్నారు. సీపీ సజ్జనార్ స్వయంగా డాక్టర్ కిడ్నాప్ జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. డాక్టర్ కిడ్నాప్ మిస్టరీని ఛేదించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం సీసీటీవీ పుటేజ్ ఆధారంగా దర్యాప్తు మొదలుపెట్టింది.
అలాగే డాక్టర్ సెల్ఫోన్ కాల్ రికార్డింగ్ను పరిశీలించారు. అటు కుటుంబసభ్యుల దగ్గర నుంచి వాంగ్మూలాన్ని కూడా రికార్డ్ చేశారు. కుటుంబ కలహాలా..లేదంటే వ్యాపార లావాదేవీల్లో కారణంగా డాక్టర్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
https://10tv.in/assam-doctor-wearing-ppe-kit-and-dance-ghungroo-song-to-cheer-up-covind-19-patients/