Road Accident : రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొట్టిన బొలెరో, ముగ్గురు మృతి
గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.

Road accident
Three Killed : రంగారెడ్డి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. షాద్ నగర్ జాతీయ రహదారిపై అతివేగంగా వచ్చిన బొలెరో వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీ కొట్టింది. దీంతో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందారు. మృతులు వనపర్తి జిల్లా కోడేరు మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్ (28), శంకర్ (32), రవి (30) గా గుర్తించారు.
Telangana University : తెలంగాణ యూనివర్సిటీలో మరో వివాదం
సమాచారం అందిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.