రూల్ ఈజ్ రూల్, కన్నతల్లినే ఊరిలోకి రాకుండా అడ్డుకున్న సర్పంచ్
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను
కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు. తెలంగాణలోనూ చాలా స్ట్రిక్ట్ గా అమలు చేస్తున్నారు. చిన్న గ్రామాలు సైతం లాక్ డౌన్ నిబంధనలను కచ్చితంగా పాటిస్తున్నాయి. ముఖ్యంగా అక్కడి సర్పంచ్ లు ముందుండి కరోనా కట్టడి చర్యల్లో పాలుపంచుకుంటున్నారు. ఎంత కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారంటే లాక్ డౌన్ వేళ ఊరిలోకి రానివ్వకుండా కన్నతల్లినే అడ్డుకున్నాడో సర్పంచ్. రూల్ ఈజ్ రూల్ అంటూ.. తల్లినే వెనక్కి పంపేశాడు.
గ్రామంలోకి రాకుండా పొలిమేరల్లోనే తల్లిని అడ్డుకున్న సర్పంచ్:
ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. సిర్గాపూర్ మండలంలోని గోసాయిపల్లిలో గ్రామ సర్పంచ్ సాయి గౌడ్ నేతృత్వంలో కరోనా కట్టడి చర్యలను తిరుగులేని విధంగా అమలు చేస్తున్నారు. ఇటీవల సాయి గౌడ్ తల్లి తులసమ్మ బంధువుల ఇంటికి వెళ్లింది. అయితే సోమవారం(ఏప్రిల్ 13,2020) తిరిగి గ్రామంలో ప్రవేశిస్తుండగా, సర్పంచ్ సాయిగౌడ్ అడ్డుకున్నాడు. గ్రామ పొలిమేరల్లోనే అడ్డుపడ్డాడు. తల్లి అయినా సరే నిబంధనలు పాటించాల్సిందేనని, లాక్ డౌన్ సమయంలో బయటి నుంచి గ్రామంలోకి ఎవరినీ అనుమతించేది లేదని కరాఖండీగా చెప్పేశాడు. తిరిగి బంధువుల ఇంటికే వెళ్లాల్సిందిగా తల్లికి స్పష్టం చేశాడు. దాంతో చేసేది లేక తులసమ్మ బంధువుల ఇంటికి తిరిగి వెళ్లింది.
ఊరి ప్రజల మేలు కోసం తల్లిని అడ్డుకున్న సర్పంచ్:
సీఎం కేసీఆర్ పిలుపు అందుకొని గోసాయిపల్లి గ్రామంలో లాక్డౌన్ పకడ్బందీగా అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ కేసులు పెరుగుతుండటంతో గ్రామంలోకి ఎవరూ రాకుండా.. గ్రామం నుంచి ఎవరూ బయటకు వెళ్లకుండా రోడ్డును మూసివేశారు. గ్రామ ప్రజలందరికీ నిబంధనలు ఒకే విధంగా వర్తిసాయని సర్పంచ్ సాయిగౌడ్ స్పష్టం చేశారు. నిబంధనలకు ప్రాధాన్యం ఇస్తూ కన్నతల్లినే ఊరిలోకి రానివ్వకుండా అడ్డుకున్న సర్పంచ్ సాయిగౌడ్ తీరుపట్ల హర్షం వ్యక్తమవుతోంది. అందరూ ఆయనను మెచ్చుకుంటున్నారు. ప్రతి ఒక్కరు లాక్ డౌన్ రూల్స్ ని కచ్చితంగా ఫాలో అయితే కరోనా వైరస్ పై విజయం సాధించడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు.
చేతిలో కర్రతో గ్రామ సరిహద్దుల్లో కాపలా కాసిన మహిళా సర్పంచ్:
ఇక తెలంగాణలోనే ఓ యువ మహిళా సర్పంచ్ కూడా ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చేతిలో కర్ర పట్టుకుని గ్రామ సరిహద్దుల దగ్గర కాపలాగా నిలుచున్న వైనం అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె పేరు ఉడుతా అఖిలా యాదవ్. వయసు 23 ఏళ్లు. మదనాపురం గ్రామానికి సర్పంచ్. గ్రామ ప్రవేశ ప్రాంతం దగ్గర కర్రతో నిల్చుని లాక్ డౌన్ నిబంధనలు అమలు చేస్తూ అందరికీ స్ఫూర్తిగా నిలిచింది. అంతేకాదు, తెలంగాణలోని పలు గ్రామాల్లో ఆసక్తికర బ్యానర్లు దర్శనమిస్తున్నాయి. ‘మీరు మా గ్రామానికి రావొద్దు, మేం మీ గ్రామానికి రాబోము’ అంటూ ఖమ్మం జిల్లాలో కొణిజెర్ల మండలం తనికెళ్ల గ్రామంలో బ్యానర్ ప్రదర్శించారు.
ఏ ఊరికి ఆ ఊరి సర్పంచ్ కథానాయకుడు కావాలన్న సీఎం కేసీఆర్:
కరోనా కట్టడి కోసం, ప్రజలు, సమాజ హితం కోసం లాక్డౌన్ పకడ్బందీగా పాటించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. లాక్ డౌన్ ను సమర్థవంతంగా అమలు చేయాలని ప్రజా ప్రతినిధులను ఆదేశించారు. ఏ ఊరికి ఆ ఊరి సర్పంచ్ కథానాయకుడు కావాలన్నారు. కేసీఆర్ పిలుపు అందుకొని సర్పంచులు, ప్రజాప్రతినిధులు లాక్డౌన్ను కచ్చితంగా అమలు చేయిస్తున్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకోవడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.