RG Kar Medical College
RG Kar Medical College: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్ కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాల అండ్ హాస్పిటల్ మరోసారి వార్తల్లోకెక్కింది. గతేడాది ఆగస్టులో ఆ ఆస్పత్రిలో వైద్యురాలి హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. తాజాగా అదే కళాశాలకు చెందిన వైద్య విద్యార్థిని ఒకరు ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర కలకలం రేపింది. 20ఏళ్ల విద్యార్థిని గురువారం రాత్రి కమర్హతిలోని ఈఎస్ఐ క్వార్టర్స్లో గల తన గదిలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బరాక్ పూర్ పోలీసులు ఘటన స్థలంను పరిశీలించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
Also Read: Wife Elope With Lover : భర్త కిడ్నీ రూ.10 లక్షలకి అమ్మేసి లవర్ తో పారిపోయిన మహిళ..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలి తల్లి ఈఎస్ఐ ఆస్పత్రిలోనే పనిచేస్తుంది. దీంతో విద్యార్థిని తన తల్లి, ఆస్పత్రి ఉద్యోగితో కలిసి ఆస్పత్రి క్వార్టర్స్ లో నివసిస్తుంది. ఆమె తండ్రి బ్యాంక్ అధికారి. ముంబైలో ఉంటున్నాడు. ఘటన జరిగినప్పుడు విద్యార్ధిని తన గదిలో ఒంటరిగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. విద్యార్ధిని తల్లి క్వార్టర్స్ తలుపులు పలుమార్లు తట్టినా ఎలాంటి స్పందన రాకపోవటంతో బలవంతంగా తలుపులు తెరిచింది. దీంతో గదిలో కుమార్తె ఉరివేసుకొని అపస్మారక స్థితిలో ఉండటాన్ని గమనించింది. స్థానికుల సహకారంతో వెంటనే ఆస్పత్రికి తరలించగా.. వైద్యులు పరీక్షించి విద్యార్థిని మృతిచెందినట్లు నిర్ధారించారు. ఘటనా స్థలంలో ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని పోలీసులు తెలిపారు. అయితే, కుటుంబ సభ్యులు కూడా పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, సదరు విద్యార్థిని దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతోంది. ఆ కారణంగా డిప్రెషన్ కుగురై విద్యార్థిని ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చునని పోలీసులు అనుమానిస్తున్నారు.
గతేడాది ఆగస్టు 9న ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ అండ్ హాస్పిటల్ సెమినార్ హాల్లో 31ఏళ్ల ట్రైనీ డాక్టర్ మృతదేహాన్ని గుర్తించారు. ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన తరువాత హత్య చేసినట్లు దర్యాప్తులో తేలింది. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో రెండు నెలలకుపైగా వైద్య సేవలు స్తంభించిపోయాయి. ఈ కేసుకు సంబంధించి ఈ ఏడాది జనవరిలో నిందితుడికి సీల్దా కోర్టు జీవిత ఖైదు విధించింది.