సింహాద్రి అప్పన్నకు బంగారు తులసి ఆకులు సమర్పించిన భక్తుడు

సింహాచలం మహా పుణ్యక్షేత్రం. విశాఖపట్నానికి 11 కిలోమీటర్ల దూరంలో తూర్పు కనుమలలో వెలసిన సింహాచలం పుణ్యక్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీ నరంసింహస్వామిగా కొలువై భక్తులతో పూజలందుకుంటున్నాడు. ఈ స్వామిని సింహాద్రి అప్పన్నగా భక్తులు కొలుచుకుంటారు. భక్తుల కొంగుబంగారంగా వెలుగొందుతున్న సింహాద్రి అప్పన్నకు తులసీ దళాలు అంటే చాలా ఇష్టం. అందుకే భక్తులు తులసీ మాలలతో స్వామివారిని పూజించుకుంటారు.
ఈ క్రమంలో బి.శ్రీనివాస్ అనే భక్తుడు స్వామివారికి 50 బంగారు తులసి పత్రాలను కానుకగా సమర్పించాడు. ఆలయ నిర్వహణాధికారి వెంకటేశ్వర రావు భక్తుడు శ్రీనివాస్ కు ప్రత్యేక దర్శనాన్ని కల్పించారు. ప్రధాన పూజారులు ఆశీర్వచనాలు ఇచ్చిన అనంతరం ప్రత్యేక తీర్థ ప్రసాదాలను అందజేశారు.
Andhra Pradesh: A devotee yesterday offered 50 gold tulsi leaves to the deity at Varaha Lakshmi Narasimha temple, Simhachalam in Visakhapatnam. pic.twitter.com/nvCe2jBSwL
— ANI (@ANI) November 22, 2019