భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునేవారికి ఏపీ సర్కార్ రక్ష: రూ.70 విలువైన కరోనా కిట్లు పంపిణీ

  • Published By: nagamani ,Published On : July 16, 2020 / 04:44 PM IST
భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునేవారికి ఏపీ సర్కార్ రక్ష: రూ.70 విలువైన కరోనా కిట్లు పంపిణీ

పేదలు..నిరుపేదలు కరోనా మహమ్మారి బారిన పడకూడదనే ఉద్ధేశ్యంతో ఏపీ ప్రభుత్వం వారికి ఉచితంగా రూ.70 విలువైన కిట్లను ఇవ్వాలని నిర్ణయించింది. భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు..ఎటువంటి ఆధారం లేకుండా చెట్ల కింద..బస్టాండ్లలో..రైల్వే స్టేషన్లలో బతుకుతున్నవారి జీవితాలు కరోనా కష్టకాలంలో దుర్భరంగా తయారయ్యాయి.

ఇటువంటివారు కరోనా బారిన పడకుండా ఉండేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కోవిడ్‌పై అవగాహన కల్పించటం..ఆరు మాస్కులు, రెండు సబ్బులతో కూడిన కిట్లులు అందించనుంది. నగరాలు, పట్టణాల్లో ఉండే వీరికి మెప్మా ద్వారా రూ.70 విలువైన కిట్‌ పంపిణీ చేయానుంది.

దీని కోసం విజయవాడ కార్పొరేషన్‌తో సహా జిల్లా వ్యాప్తంగా నగరాలు, పట్టణ ప్రాంతాల్లో ఉన్న భిక్షగాళ్లు, చిత్తుకాగితాలు ఏరుకునే వారు, రోడ్డుపక్క ఎటువంటి ఆధారం లేకుండా జీవిస్తున్న వార్ని ఇప్పటికే మెప్మా సహకారంతో గుర్తించారు. ఇలా గుర్తించినవారు విజయవాడ కార్పొరేషన్‌ పరిధిలో 997 మంది..మచిలీపట్నం కార్పొరేషన్‌ పరిధిలో 230 మంది, గుడివాడ సిటీలో 300 మంది, తిరువురూలో 94 మంది, జగ్గయ్యపేటలో 80 మంది, నందిగామలో 68, నూజివీడులో 60 మంది పెడనలో 58 మంది, ఉయ్యూరులో 34 మంది కలిపి మొత్తం 1991 కుటుంబాలును గుర్తించారు. వీరందరికి త్వరలోనే ఉచితంగా కిట్లను పంపిణీ చేయనుంది. దీంట్లో భాగంగా రాష్ట్రంలోనే తొలిసారి కృష్ణా జిల్లాలో ఈ కిట్‌లను పంపిణీ చేయనున్నారు.