సీఎం జగన్ కీలక నిర్ణయం : జెరూసలెం యాత్రికులకు ఆర్థికసాయం పెంపు

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 09:14 AM IST
సీఎం జగన్ కీలక నిర్ణయం : జెరూసలెం యాత్రికులకు ఆర్థికసాయం పెంపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జెరూసలెం వెళ్లే క్రైస్తవ యాత్రికులకు ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సాయాన్ని పెంచింది. గతంలో రూ.40వేలు ఆర్థికసాయంగా ఇచ్చేవారు. ఆ మొత్తాన్ని రూ.60వేలకు పెంచారు. రూ.3లక్షలలోపు వార్షిక ఆదాయం ఉన్న వారికి ప్రభుత్వం ఈ ఆర్థికసాయం ఇస్తుంది. అలాగే రూ.3లక్షల కన్నా ఎక్కువ వార్షిక ఆదాయం ఉన్నవారికి కూడా ఆర్థికసాయం పెంచారు. రూ.20వేల నుంచి రూ.30వేలకు పెంచారు. 

ఆర్థికసాయం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ప్రభుత్వం నిర్ణయం పట్ల క్రైస్తవ వర్గాల నుంచి హర్షం వ్యక్తం అవుతోంది. జెరూసలెంతో పాటు ఇతర క్రైస్తవ ప్రార్థనా స్థలాల సందర్శనం కోసం ఈ సాయం అందజేస్తారు.

క్రైస్తవుల పవిత్ర క్షేత్రం జెరూసలెం. ఏపీ నుంచి అనేకమంది యాత్రకు వెళ్తుంటారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు ప్రభుత్వం ఆర్థికసాయం చేస్తుంది.