ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది : మంత్రి బుగ్గన

ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు.

  • Published By: veegamteam ,Published On : October 11, 2019 / 01:09 PM IST
ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉంది : మంత్రి బుగ్గన

ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. విద్యుత్ పై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు.

ఏపీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గానే ఉందని ఏపీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అన్నారు. ఫిబ్రవరిలో క్రిసిల్ A+ రేటింగ్ ఇచ్చిందని తెలిపారు. కేవలం జూన్ లో మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఉందని చెప్పారు. అమరావతిలో శుక్రవారం (అక్టోబర్ 11, 2019) విద్యుత్ పై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. పవర్ ఫైనాన్స్ అప్పుపై ఇష్టారీతిన మాట్లాడుతున్నారని చెప్పారు. విద్యుత్ రంగంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 

గత ప్రభుత్వం డిస్కంలకు పెద్ద మొత్తంలో బకాయి పెట్టిందన్నారు. ధరలు తగ్గుతున్నాయని తెలిసి కూడా ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నారని తెలిపారు. ఎక్కువ ధరకు విద్యుత్ తీసుకోవడంతో రూ.2 వేల 700 కోట్ల నష్టం వాటిల్లిందన్నారు. 25 ఏళ్లకు హడావుడిగా పీపీఏలు చేసుకున్నారని గుర్తు చేసుకున్నారు.