జగన్ దీపావళి కానుక : ఒకే రోజు 3 శుభవార్తలు

జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు

  • Published By: veegamteam ,Published On : October 26, 2019 / 01:45 PM IST
జగన్ దీపావళి కానుక : ఒకే రోజు 3 శుభవార్తలు

జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు

జగన్ ప్రభుత్వం శనివారం(అక్టోబర్ 26,2019) మూడు కీలక నిర్ణయాలు తీసుకుంది. శుభవార్తలు వినిపించింది. మెట్రో నగరాల్లో వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు, శానిటేషన్ కార్మికులకు వేతనాలు పెంచుతూ మూడు వేర్వేరు ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీలోనే కాకుండా ఇతర రాష్ట్రాల్లోనూ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ సేవలు వర్తించేలా ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. ఈ ఉత్తర్వుల ప్రకారం హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై నగరాల్లో ఉన్న 150 సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రుల్లోనూ ఆరోగ్యశ్రీ సేవలు అందుతాయి. నవంబర్‌ 1 నుంచి 716 సూపర్ స్పెషాలిటీ ట్రీట్‌మెంట్లకు ఆరోగ్యశ్రీ వర్తిస్తుందని తాజా ఉత్తర్వుల్లో తెలిపారు. వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు సీఎం జగన్‌ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు. 

అంతేకాదు.. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు పెన్షన్లు అమలు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది జగన్ ప్రభుత్వం. జనవరి 1 నుంచి పెన్షన్ల పంపిణీ ప్రారంభం కానుంది. పోస్ట్ ఆపరేటివ్ అలవెన్స్ ని ప్రభుత్వం ప్రకటించింది. అంటే.. ఆపరేషన్ తర్వాత ఆస్పత్రిలో ఉన్నప్పుడు.. రోజుకు రూ.225 చెల్లిస్తారు. 

తలసేమియా, సికిల్‌సెల్ డిసీజ్, సివియర్ హీమోఫీలియా వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి నెల​కు రూ. 10 వేలు పెన్షన్‌ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. బోధకాలు, పక్షవాతం, ప్రమాద బాధితులకు నెలకు రూ.5 వేలు పెన్షన్ ఇవ్వనున్నారు. దారిద్ర్యరేఖకు దిగువన ఉన్న కుటుంబాల వారికి మాత్రమే ఈ అలవెన్సు ఇస్తారు.

ఆరోగ్యశ్రీ పథకం కింద ఆపరేషన్‌ చేయించుకున్న పేషెంట్లు కోలుకునే వరకు విశ్రాంతి సమయంలో రోజుకు రూ.225 చొప్పున ఇస్తామని, రోగి ఎక్కువ రోజులు విశ్రాంతి తీసుకోవాల్సి వస్తే నెలకు రూ.5 వేలు చెల్లిస్తామని సీఎం జగన్‌ ఇచ్చిన హామీకి అనుగుణంగా వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు ఇచ్చింది. డిసెంబర్ 1 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది.

అలాగే ఆస్పత్రుల్లోని పారిశుధ్య కార్మికులకు జగన్ ప్రభుత్వం శుభవార్త వినిపించింది. సీఎం జగన్‌ ఆదేశాల మేరకు వేతనాలను భారీగా పెంచుతూ ఉత్తర్వులు వెలువరించింది. తాజా పెంపుతో పారిశుధ్య కార్మికులు నెలకు రూ. 16 వేల వరకు జీతం అందుకోనున్నారు. జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుంది. ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, వైద్యారోగ్య కళాశాలల్లో పనిచేసే పారిశుధ్య కార్మికులకు ఈ పెంపు వర్తిస్తుంది. ప్రజారోగ్య సంరక్షణకు పెద్దపీట వేస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.