అమెరికాలో కేరళ నర్సుని ఆస్పత్రి బైటే పొడిచి చంపిన భర్త

  • Published By: nagamani ,Published On : July 30, 2020 / 01:17 PM IST
అమెరికాలో కేరళ నర్సుని ఆస్పత్రి బైటే పొడిచి చంపిన భర్త

కట్టుకున్న భర్తే భార్యను అతి దారుణంగా కత్తితో పొడిచి పొడిచి చంపేశాడు. కుటుంబంలో జరిగిన విభేదాలతో నర్సుగా పనిచేస్తున్న భార్య డ్యూటికి వెళ్లి వస్తున్న సమయంలో హాస్పిటల్ ముందే కత్తితో పొడిచి చంపేశాడు భర్త. ఈ దారుణ ఘటన అమెరికాలోని ఫ్లోరిడాలో ఇండియా కాలమానం ప్రకారం గురువారం(జులై 29,2020) జరిగింది.

కేరళలోని కొట్టాయంకు చెందిన మెరీన్ జాయ్ అనే 26ఏళ్ల నర్స్ అమెరికాలోని దక్షిణ ఫ్లోరిడాలోని కోరల్ స్ప్రింగ్స్ హాస్పిటల్ లో పనిచేస్తోంది. గురువారం ఉదయం డ్యూటీ ముగించుకుని ఇంటికి బయలుదేరింది. పార్కింగ్ లో ఉన్న తన వాహనం దగ్గరు వచ్చింది. కానీ అప్పటికే పార్కింగ్ స్థలంలో ఉన్న ఆమె భర్త ఫిలిప్ మాథ్యూ కత్తితో ఆమెను విచక్షణ రహితంగా పొడిచాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను వెంటనే ఆసుపత్రికి తరలించగా..అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. ఈ ఘటనపై భర్త మాథ్యూని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

మెరీన్ జాయ్ కు భర్త ఫిలిప్ మాథ్యూకు మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో భార్యపై ఆగ్రహంతో ఉన్న భర్త ఆమెను పొడిచి చంపినట్లుగా పోలీసుల విచారణలో తేలింది. ఫిలిప్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు అతడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

తమ హాస్పిటల్ పనిచేసే నర్స్ మెరీన్ జాయ్ హత్యపై కోరల్ స్ప్రింగ్స్ హాస్పిటల్ యాజమాన్యం స్పందిస్తూ..చాలా అంకిత భావంతో మెరీన్ పనిచేసేందని మా హాస్పిటల్ లో పనిచేసేవారంతో ఓ కుటుంబంలోని వ్యక్తులు పనిచేసేవారని..అటువంటి కుటుంబంలో వ్యక్తి మేరీన్ హత్యకు గురికావటం చాలా బాధకరమని CEO జారెడ్ స్మిత్ విచారం వ్యక్తంచేశారు. రెండేళ్ల నుంచి మెరీన్ మా హాస్పిటల్ లో పనిచేస్తోందని మెరీన్ మరణం చాలా బాధగా ఉందనీ..ఆమె కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నామని CEO జారెడ్ స్మిత్ అన్నారు.