మాయగాళ్లు : ఎమ్మెల్యే ఆమంచినే బురిడీ కొట్టిస్తూ కోయదొర అరెస్ట్

అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు. 

  • Published By: vamsi ,Published On : April 30, 2019 / 07:24 AM IST
మాయగాళ్లు : ఎమ్మెల్యే ఆమంచినే బురిడీ కొట్టిస్తూ కోయదొర అరెస్ట్

అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు. 

ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్ధి ఆమంచి కృష్ణ మోహన్‌‌కు టోకరా ఇచ్చేందుకు ట్రై చేశారు ఇద్దరు వ్యక్తులు. ఎమ్మెల్యేకు నరదిష్టి ఎక్కువగా ఉందని, దిష్టి పోవాలంటే పూజలు చేయాలని చెప్పిన హైదరాబాద్‌కు చెందిన కోయదొరలు.. చీరాలలోని ఆమంచి కృష్ణ మోహన్ ఇంటికి వచ్చారు.

ఎమ్మెల్యే ఇంటికి వచ్చిన కోయదొరలు చిన్న చిన్న పూజలు చేసి రూ.5వేలు తీసుకున్నారు. ఈ పూజలతో నరదిష్టి పోదని.. మొత్తం నరదిష్టి పోవాలంటే పెద్ద పెద్ద పూజలు చేయాలని నమ్మించారు. అందుకు రూ.12లక్షలు ఖర్చు అవుతుందని చెప్పారు. అంతకుముందు పెద్దపెద్ద సినిమా వాళ్లకు, పేరుమోసిన రాజకీయ నాయకులకు పూజలు చేశామని ఇప్పుడు వారి పరిస్థితి బాగుందని నమ్మించే ప్రయత్నం చేశారు. 

అనుమానం వచ్చిన ఎమ్మెల్యే ఆమంచి.. ఎవరెవరికి పూజలు చేశారని ప్రశ్నించారు. వారు చెప్పిన పేర్లతో అనుమానం వచ్చిన ఆమంచి.. క్రాస్ ఎంక్వైరీ చేశారు. హైదరాబాద్ ఫోన్ చేసి అన్ని వివరాలు తెలుసుకున్నారు. కోయదొరలు మోసగాళ్లు అని భావించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో హైదరాబాద్‌కు కుమార్ బాబును అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. మరో నిందితుడు కోసం గాలిస్తున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.

ఎమ్మెల్యే ఆమంచినే నమ్మించగలిగాడు అంటే వాళ్లు మాములోళ్లు కాదంటూ చీరాలలో డిస్కషన్ జరుగుతోంది.