చంద్రబాబుకు లక్షా 20వేల మెజారిటీ రావాలి: నారా భువనేశ్వరి

  • Published By: vamsi ,Published On : April 3, 2019 / 01:48 AM IST
చంద్రబాబుకు లక్షా 20వేల మెజారిటీ రావాలి: నారా భువనేశ్వరి

తెలుగుదేశం అధినేత, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భార్య భువనేశ్వరి చంద్రబాబు సొంత నియోజకవర్గం కుప్పంలోని పార్టీ నేతలు, కార్యకర్తలతో టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈసారి ఎలాగైనా చంద్రబాబుకు లక్షా 20వేల ఓట్ల ఆధిక్యం రావాలని, అందుకు అనుగుణంగా నేతలు పనిచేయాలని ఆమె సూచించారు. గత ఎన్నికల్లో చంద్రబాబుకు 63 శాతం ఓట్లు వచ్చాయని.. ఈసారి 75 శాతం పడేలా కృషి చేయాలని ఆమె అన్నారు.

కుప్పం నియోజకవర్గంలో పార్టీ పరంగా ఏ అవసరం ఉన్నా కార్యకర్తలు తనను సంప్రదించాలని, నియోజకవర్గంలోని శాంతిపురం, రామకుప్పం, గుడిపల్లి మండలాలకు చెందిన 1250 మంది కార్యకర్తలతో పాటు ముఖ్యనేతలు శ్రీనివాసులు, మునిరత్నం, మనోహర్‌, సుబ్రహ్మణ్యం, రెడ్డి చంద్రశేఖర్‌ తదితరుల ఈ  సమావేశంలో పాల్గొన్నారు.