ఘోర ప్రమాదం : సాగర్‌లో కారుతోపాటు ఆరుగురు గల్లంతు

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.

  • Published By: veegamteam ,Published On : October 19, 2019 / 03:00 AM IST
ఘోర ప్రమాదం : సాగర్‌లో కారుతోపాటు ఆరుగురు గల్లంతు

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు.

సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన చోటు చేసుకుంది. నాగార్జున సాగర్ ఎడమ కాలువలోకి ఓ కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారుతోపాటు ఆరుగురు గల్లంతయ్యారు. ప్రమాద సమయంలో కారులో ఆరుగురు ఉన్నట్టు తెలుస్తోంది. కోదాడ నియోజకవర్గం నడిగూడెం మండలం చాకిరాల దగ్గర వేగంగా వచ్చిన కారు అదుపుతప్పి నాగార్జున సాగర్‌ ఎడమ కాలువలోకి దూసుకెళ్లింది.

అదుపుతప్పి నాగార్జునసాగర్ కాలువలోకి దూసుకెళ్లిన స్కార్పియో కారు నెంబర్ AP31 BP 333గా గుర్తించారు. ప్రమాదంలో గల్లంతైన వారంతా.. హైదరాబాద్‌లోని ఏఎస్ రావు నగర్‌లోని అంకుర్ హాస్పిటల్‌ సిబ్బంది. సికింద్రాబాద్‌కు చెందిన అబ్దుల్‌, రాజేష్‌, జాన్సన్‌, సంతోష్‌కుమార్‌, నరేష్‌, పవన్‌కుమార్‌గా గుర్తించారు. చాకిరాలలో జరిగిన సహోద్యోగి వివాహానికి హాజరై తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అయితే.. సాగర్ కాలువ ఉధృతంగా ప్రవహిస్తుండటంతో సహాయ చర్యలకు ఆటంకం కలుగుతోంది. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ ప్రమాద స్థలానికి వెళ్లారు. స్థానిక ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ కూడా అక్కడికి చేరుకుని సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పోలీసులను అడిగి వివరాలు తెలుసుకున్నారు.