అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం : చంద్రబాబు

  • Published By: veegamteam ,Published On : October 3, 2019 / 03:55 PM IST
అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న వైసీపీ ప్రభుత్వం : చంద్రబాబు

వైసీపీ ప్రభుత్వ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని విమర్శించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందన్నారు. టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని మండిపడ్డారు. సోషల్ మీడియాలో పోస్టులు పెడితే జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

సెక్షన్ 153ఏ కింద కేసులు పెట్టి బెదిరిస్తున్నారని వాపోయారు. తమపై వైసీపీ కార్యకర్తలు అసభ్యంగా పోస్టులు పెడుతున్నారని తెలిపారు. వైసీపీ పోస్టులపై డీజీపీకి ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని దీనిపై డీజీపీ సమాధానం చెప్పాలన్నారు. ఇలాంటి దారుణమైన పరిస్థితులు ఎప్పుడూ చూడలేదని వాపోయారు.

ఇష్టానుసారంగా వ్యవహరించడానికి ఇది పులివెందుల కాదన్నారు. తప్పుడు పనులు చేస్తే సహించేది లేదన్నారు. ప్రజలు అసహ్యించుకునేలా వైసీపీ నేతలు చేసుకోవదన్నారు. తాను క్యారెక్టర్ మెయింటెయిన్ చేశానని చెప్పారు. తనకున్నదే నీతి, విశ్వసనీయత అన్నారు.