ఆంధ్రా శ్రీరాముడు బాబు : జగన్‌కు ఓటెందుకు వేస్తారు – బుద్ధా

  • Published By: madhu ,Published On : April 21, 2019 / 01:09 PM IST
ఆంధ్రా శ్రీరాముడు బాబు : జగన్‌కు ఓటెందుకు వేస్తారు – బుద్ధా

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో శ్రీరాముడి పాలన చేస్తున్న సీఎం బాబుపై విమర్శలు చేయడం కరెక్టు కాదన్నారు టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న. జీవిఎల్ మైక్‌లలో, విజయసాయి ట్విట్టర్‌లలో
విమర్శలు చేస్తున్నారని..జీవీఎల్‌పై చెప్పులు విసిరినట్టు, విజయసాయికి మే 23 తర్వాత చెప్పుదెబ్బలు తప్పవన్నారు. దేశంలో బీజేపీ పరిస్థితిని జీవీఎల్‌పై విసిరిన చెప్పు చెప్పకనే చెపుతుందని తెలిపారు. ఏప్రిల్ 21వ తేదీ ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. 

JD లక్ష్మీనారాయణపై విజయసాయిరెడ్డి ట్వీట్‌లు పెడుతున్నారని గుర్తు చేసిన బుద్ధా..విజయసాయి చరిత్ర మొత్తం జేడీ వద్ద ఉందన్నారు. మోడీకి ప్రతి రాష్ట్రంలో ఎదురు గాలి వీస్తోందన్నారు. మోడీ దిగిపోగానే విజయసాయికి ఇబ్బందులు తప్పవని హెచ్చరించారు. ఇక జగన్ విషయానికి వస్తే..తండ్రి పదవిని అడ్డం పెట్టుకొని లక్షల కోట్లు దోచుకున్న వ్యక్తి అని తెలిపారు. ప్రజలను దోచుకొన్నందుకు ఆయనకు ఓట్లు వేస్తారా ? అసలు ప్రజలు జగన్‌కి ఎందుకు ఓటు వేస్తారో ఆ పార్టీ నేతలు చెప్పాలన్నారు. జగన్‌కు రాజకీయ అవగాహన లేదని..అప్పుల ఊబిలో ఉన్న రాష్ట్రాన్ని కాపాడినందుకు..సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టిన చంద్రబాబుకు ప్రజలు ఓట్లు వేస్తారని చెప్పారు.