దిశ ఘటన మరువక ముందే: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. అత్యాచారం, హత్య

  • Published By: vamsi ,Published On : December 3, 2019 / 07:03 AM IST
దిశ ఘటన మరువక ముందే: తూర్పు గోదావరి జిల్లాలో దారుణం.. అత్యాచారం, హత్య

దిశ హత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న సమయంలోనే ఆ ఘటన మరవక ముందే అటువంటి మరో దారుణ ఘటనే ఏపీలో చోటుచేసుకుంది. 

50ఏళ్ల మహిళపై ముగ్గురు వ్యక్తులు అత్యంత కిరాతకంగా అత్యాచారానికి పాల్పడి హత్య చేశారు.

వివరాల్లోకి వెళ్తే.. తూర్పు గోదావరి జిల్లా ఐ.పోలవరం మండలం జి.వేమవరంకు చెందిన 50 ఏళ్ల మహిళపై దుండగులు సామూహిక అత్యాచారం చేసి చంపేశారు. ఓ ఇంట్లో నివాసం ఉంటున్న నాగమణి అనే మహిళను అత్యాచారం చేశారు దుండగులు. భర్త చనిపోవడం, పిల్లలు దూరంగా స్థిరపడడంతో ఆమె ఒంటరిగా ఉంటున్నారు. 

ముగ్గురు వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. నిందితుల్లో ఒకరిని అదుపులోకి తీసుకోగా..  మిగిలిన ఇద్దరి కోసం గాలింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ తెలిపారు.