మే 1న మహర్షి ప్రీ- రిలీజ్ ఈవెంట్ : ఎక్కడో తెలుసా?
మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని, పీపుల్స్ ప్లాజాలో, సాయంత్రం 6 గంటలనుండి మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది.
మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని, పీపుల్స్ ప్లాజాలో, సాయంత్రం 6 గంటలనుండి మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది.
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో, సూపర్ స్టార్ మహేష్ బాబు, పూజాహెగ్డే, అల్లరి నరేష్ మెయిన్ లీడ్స్గా నటిస్తున్న మహర్షి మూవీ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటివరకు రిలీజ్ చేసిన టీజర్కి, సాంగ్స్కి మంచి రెస్పాన్స్ వస్తుంది. మహేష్ 25వ సినిమా కావడంతో మహర్షిపై భారీ అంచనాలున్నాయి. ఇప్పుడు మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్కి ముహూర్తం ఫిక్స్ చేసింది అదికూడా సినిమా వారం ముందు కావడం విశేషం. మూవీ యూనిట్.. మే 1న హైదరాబాద్ నెక్లెస్ రోడ్లోని, పీపుల్స్ ప్లాజాలో, సాయంత్రం 6 గంటలనుండి మహర్షి ప్రీ-రిలీజ్ ఈవెంట్ స్టార్ట్ కానుంది. ఇప్పటివరకు మహేష్తో పనిచేసిన దర్శకులందరూ ఈ వేడుకకు విచ్చేస్తారని తెలుస్తుంది. అశ్వినీదత్, దిల్ రాజు, పీవీపి కలిసి నిర్మించగా, రాక్స్టార్ దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ అందించాడు. ఈరోజు (ఏప్రిల్ 24 సాయంత్రం) మహర్షి నుండి పదరా పదరా అనే సాంగ్ రిలీజ్ కానుంది. సినిమా మే 9న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ అవనుంది.
వాచ్ మహర్షి టీజర్..