విజయ్ నిర్మాత తరుణ్ హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’

డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా ఓ సినిమాను రూపొందించనున్నాడు..

  • Published By: sekhar ,Published On : August 29, 2019 / 05:54 AM IST
విజయ్ నిర్మాత తరుణ్ హీరోగా ‘మీకు మాత్రమే చెప్తా’

డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా ఓ సినిమాను రూపొందించనున్నాడు..

సెన్సేషనల్ స్టార్ విజయ్ దేవరకొండ నిర్మాతగా మారుతున్నాడు.. తనకు హీరోగా బ్రేక్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ భాస్కర్‌ను హీరోగా పరిచయం చేస్తూ, తన సొంత ప్రొడక్షన్‌లో ఓ సినిమాని నిర్మించనున్నాడు. సినిమా టైటిల్‌తో సహా ఈ విషయాన్ని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు.

కింగ్ ఆఫ్ ది హిల్ అనే ప్రొడక్షన్ హౌస్ స్టార్ట్ చేసి, తరుణ్ భాస్కర్ లీడ్ రోల్‌లో నటించబోయే చిత్రాన్ని తాను నిర్మించనున్నట్టు.. ఆ సినిమాకు ‘మీకు మాత్రమే చెప్తా’ అనే టైటిల్ ఫిక్స్ చేసినట్టు ప్రకటించారు. ప్రాజెక్ట్ అండ్ టైటిల్ అనౌన్స్‌మెంట్‌కి సంబంధించిన వీడియో కూడా రిలీజ్ చేశారు.

Read Also : క్రిస్మస్‌కు భీష్మ..

తరుణ్ క్రికెట్ ఆడుతుండగా విజయ్ కాల్ చేసి, ఎక్కడున్నావని అడగడం.. ఓ మంచి కథ విన్నా, హీరోగా చేస్తావా అని అడగడం, నా సేవింగ్స్‌తో నేనే ప్రొడ్యూస్ చేస్తానని చెప్పడం, తీరా టైటిల్ చెప్తే షాకవ్వడం.. ఇలా వీడియో భలే ఫన్నీగా.. ఇంట్రెస్టింగ్‌గా ఉంది. త్వరలో ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియనున్నాయి..