విషాదం : ఐఐటీ హైదరాబాద్ లో విద్యార్ధి ఆత్మహత్య
సంగారెడ్డి జిల్లా కందిలోని ఐఐటీ..హైదరాబాద్ లో ఓ విద్యార్ధి ఆత్మహత్య చేసుకున్నాడు. బీటెక్ మూడవ సంవత్సరం చదువుతున్న సిధ్దార్ధ అనే విద్యార్ధి హాస్టల్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్యకు గల కారణం తెలియాల్సి ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.