visakha : నేడు విశాఖలో ఇంటర్నేషనల్ సిటీ పరేడ్.. హాజరుకానున్న సీఎం జగన్
మిలాన్ విన్యాసాల్లో భాగంగా నేడు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనుంది. నౌకాదళాలకు చెందిన వివిధ దేశాల ప్రతినిధులు ఈ కవాతులో పాల్గొననున్నారు.
visakha : విశాఖ సాగరతీరంలో మిలాన్-2022 వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. తూర్పునౌకాదళం వేదికగా ఈ మిలాన్ విన్యాసాలు మార్చి 4 వరకూ జరగనున్నాయి. సుమారు 39 దేశాల నుంచి నౌకలు, సబ్మెరైన్లు, యుద్ధవిమానాలు మిలాన్ విన్యాసాల్లో పాల్గొన్నాయి. మిలాన్ విన్యాసాల్లో భాగంగా నేడు ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ నిర్వహించనుంది. నౌకాదళాలకు చెందిన వివిధ దేశాల ప్రతినిధులు ఈ కవాతులో పాల్గొననున్నారు. ఈ కార్యక్రమానికి ఏపీ సీఎం జగన్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు. ఐఎన్ఎస్ విశాఖ అనే నౌకను సీఎం జగన్ జాతికి అంకితం చేయనున్నారు.
ఇంటర్నేషనల్ సిటీ పరేడ్ సందర్భంగా నేవీ దళాలు బీచ్ రోడ్డులో కవాత్ నిర్వహించాయి. పలు సైనిక స్కూళ్లకు చెందిన విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. బీచ్లో శత్రుసేనలను మట్టుపెట్టే దృశ్యాలు అబ్బురపరిచాయి. బీచ్రోడ్డును సర్వాంగ సుందరంగా జిల్లా అధికార యంత్రాంగం, నేవీ సిద్ధం చేసింది.
Vizag : విశాఖకు సీఎం జగన్.. యుద్ధనౌకల సమాహారం
ఇప్పటికే విద్యుద్దీపాల అలంకరణతో బీచ్ రంగుల మయంగా మారింది. నేడు పరేడ్ ఉండడంతో.. నగరంలో ట్రాఫిక్ నిబంధనలను పోలీసులు అమలు చేస్తున్నారు. ఇవాళ సాయంత్రం 5.30గంటలకు సిటీ పరేడ్ ప్రారంభం కానుంది. దీనిని ప్రజలు దూరం నుంచీ కూడా తిలకించేందుకు వీలుగా ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు.