KTR: ఉప్పల్లో అభివృద్ధి పనులకు కేటీఆర్ శంకుస్థాపన
హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకుగానూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని...
KTR: హైదరాబాద్లోని ఉప్పల్ నియోజకవర్గ పరిధిలో పలు అభివృద్ధి పనులకుగానూ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొనున్నారు మునిసిపల్ శాఖ మంత్రి కేటీఆర్. జీహెచ్ఎంసీ పరిధిలోని డెవలప్మెంట్ పనుల శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
కాప్రా సర్కిల్ పరిధిలోని మల్లాపూర్ వద్ద వైకుంఠధామాన్ని ప్రారంభించనున్నారు. నాచారం డివిజన్ పరిధిలో వాటర్ బోర్డు ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సివెజ్ ట్రీట్ ప్లాంట్ పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఆ తర్వాత ఉప్పల్ వద్ద ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులో భాగంగా నిర్వహించిన ఫ్లైఓవర్ పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఓపెన్ రింగ్ రోడ్డు వద్ద నిర్మించిన థీమ్ పార్క్ను ప్రారంభిస్తారు మంత్రి కేటీఆర్.
Read Also: తెలంగాణ వంటి పాలన దేశంలోనే లేదు: మంత్రి కేటీఆర్