Road Accident : ఏజెన్సీ ప్రాంతంలో బస్సు, లారీ ఢీ-20 మందికి గాయాలు
తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం న
Road Accident : తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఈ రోజు ఉదయం రోడ్డు ప్రమాదం సంభవించింది. మారేడుమిల్లి-చింతూరు ఘాట్ రోడ్డులో జరిగిన రోడ్డు ప్రమాదంలో 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. భద్రచలం నుంచి కాకినాడ వస్తున్న గోకవరం డిపో ఆర్టీసీ బస్సు- చత్తీస్ ఘడ్ కు చెందిన లారీని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ తో సహా 20 మందికి ప్రయాణికులకు గాయాలయ్యాయి. గాయపడిన వారిని మారేడుమిల్లి, రంపచోడవరం ప్రభుత్వాస్పత్రులకు తరలించారు. మారేడుమిల్లికి 3 కి.మీ దూరంలో ఉన్న వాలమూరు వద్ద ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బస్సులో 45 మంది ప్రయాణికులున్నట్లు తెలుస్తోంది.
Also Read : Vijayawada : భార్యను గొంతుకోసి హత్య చేసిన భర్త