Pawan kalyan: నేడు నంద్యాలకు పవన్.. రైతు కుటుంబాలకు చెక్కులు పంపిణీ
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కౌలు రైతు భరోసా’ యాత్ర పేరుతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం విధితమే. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయంతో...
Pawan kalyan: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ‘కౌలు రైతు భరోసా’ యాత్ర పేరుతో రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో పర్యటిస్తున్న విషయం విధితమే. ఆత్మహత్యలు చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలను పరామర్శించి వారికి ఆర్థిక సాయంతో పాటు, భరోసా కల్పించేందుకు జనసేనాని కౌలు రైతు భరోసా యాత్ర చేపట్టారు. ఈ యాత్రలో భాగంగా ఇప్పటికే అనంతపురం, పశ్చిమ గోదావరి జిల్లాల్లోని ఆత్మహత్యలకు పాల్పడిన పలు రైతుల కుటుంబాలను పరామర్శించి, వారికి సాయం అందించారు. ఈ క్రమంలో ఆదివారం నంద్యాల జిల్లాలో పవన్ పర్యటించనున్నారు.
ఉమ్మడి కర్నూల్ జిల్లాలో "జనసేన కౌలు రైతు భరోసా యాత్ర"
జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130మంది కౌలు రైతుల కుటుంబాలను జనసేనాని శ్రీ @PawanKalyan గారు ఈ నెల 8వ తేదీన శిరివెళ్ళ మండల కేంద్రంలో రచ్చబండ కార్యక్రమంలో ప్రతీ కుటుంబాన్నీ పరామర్శించి, లక్ష రూపాయలు చొప్పున చెక్కులు అందజేస్తారు pic.twitter.com/qncWn87aft— JanaSena Party (@JanaSenaParty) May 5, 2022
జిల్లాలోని శిరివెళ్ల గ్రామంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో పాల్గొంటారు. నంద్యాలలో ఆత్మహత్య చేసుకున్న ఐదుగురు రైతు కుటుంబాలను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారు. శిరివెళ్ళ మండలంలో నిర్వహించే రచ్చబండ కార్యక్రమంలో జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న 130మంది రైతు కుటుంబాలకు పవన్ కల్యాణ్ చెక్కులు పంపిణీ చేస్తారు. నంద్యాల పర్యటనలో భాగంగా ఉదయం 9గంటలకు కర్నూలు ఎయిర్ పోర్ట్ కు పవన్ చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గంలో సిరువెళ్ల వెళ్లనున్నారు. మార్గ మధ్యంలో పలుచోట్ల ప్రజలతో ముఖాముఖి నిర్వహిస్తారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబ సభ్యులతో సిరువెళ్లలో 2.30 గంటలకు పవన్ కల్యాణ్ ముఖాముఖి కానున్నారు. ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించి, ప్రసంగించనున్నారు. ఇదిలా ఉంటే పవన్ కల్యాణ్ పర్యటన దృష్ట్యా పోలీసులు ముందస్తుగా భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు.