Telangana Corona News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 489 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 367 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,011కి తగ్గింది.
Telangana Corona News : తెలంగాణలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తక్కువ సంఖ్యలో రోజువారీ కేసులు నమోదవుతుండటం ఊరటనిచ్చే అంశం. గడిచిన 24 గంటల్లో 12వేల 820 మందికి కరోనా పరీక్షలు చేయగా, 152 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. హైదరాబాద్ లో అత్యధికంగా 60 కేసులు వచ్చాయి. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 9 కేసులు, నల్గొండ జిల్లాలో 8 కేసులు, రంగారెడ్డి జిల్లాలో 7 కేసులు వెల్లడయ్యాయి.
అదే సమయంలో ఒక్కరోజు వ్యవధిలో మరో 145 మంది కరోనా నుంచి కోలుకున్నారు. కొత్తగా కరోనా మరణాలేవీ నమోదు కాలేదు.
రాష్ట్రంలో నేటివరకు 8లక్షల 35వేల 489 కొవిడ్ పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 8లక్షల 30వేల 367 మంది కోలుకున్నారు. రాష్ట్రంలో కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 1,011కి తగ్గింది. రాష్ట్రంలో నేటివరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 4వేల 111. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం కరోనా బులెటిన్ విడుదల చేసింది. క్రితం రోజు రాష్ట్రంలో 11వేల 632 మందికి కరోనా పరీక్షలు చేయగా, 141 మందికి పాజిటివ్ గా తేలింది.
తెలంగాణ కరోనా బులెటిన్..
Media Bulletin on status of positive cases #COVID19 in Telangana.
(Dated.07.09.2022 at 5.30pm)@TelanganaHealth #StaySafeStayHealth pic.twitter.com/85vOKoU8Px— IPRDepartment (@IPRTelangana) September 7, 2022