కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష : రాహుల్ గాంధీ

ఢిల్లీలో ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. జాతీయ ఉపాధిహామీ కూలీ 400కు పెంచుతాం. దేశంలో ఉన్న 90శాతం పేదల తలరాతలు మారుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు.

కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. ప్రతి పేద కుటుంబానికి ఏడాదికి రూ.లక్ష : రాహుల్ గాంధీ

Rahul Gandhi

Rahul Gandhi : బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం, దానివల్ల వచ్చే హక్కులు, రిజర్వేషన్లు రద్దవుతాయని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అన్నారు. లోక్ సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్మల్ జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ జన జాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి సీతక్క, టీజేఎస్ అధ్యక్షుడు ఫ్రొ.కోదండరాం, కాంగ్రెస్ నేతలతో కలిసి రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాజ్యాంగాన్ని కాపాడే కాంగ్రెస్ కావాలో.. రాజ్యాంగాన్ని రద్దు చేయాలనుకుంటున్న బీజేపీ-ఆర్ఎస్ఎస్ కావాలో నిర్ణయించుకోవాలని ప్రజలకు సూచించారు. ఉచిత పథకాలు అమలు చేస్తే సోమరిపోతులుగా తయారు చేస్తున్నారని అంటున్నారని రాహుల్ విమర్శించారు.

Also Read : జూన్4న వెలువడే ఫలితాల్లో బీజేపీ ప్రభంజనాన్ని చూస్తారు : కిషన్ రెడ్డి

తెలంగాణ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారంటీలు అమలు చేస్తున్నామని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పేదల జాబితా తయారు చేసి.. ప్రతి కుటుంబానికి ఏడాదికి లక్ష రూపాయలు వేస్తామని చెప్పారు. దేశంలో నిరుద్యోగ సమస్య తీరుస్తాం. గ్రాడ్యుయేట్స్ కు ఏడాది గ్యారెంటీ స్కీం అమలు చేస్తాం. ఏడాది వరకు ప్రభుత్వ, ప్రైవేట్ సెక్టార్లలో ఉధ్యోగాలు కల్పిస్తాం. ఏడాది తరువాత ఆ ఉద్యోగులను పర్మినెంట్ చేస్తామని రాహుల్ చెప్పారు. 30లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తాం. ఆదివాసీలకు జల్ జమీన్ జంగల్ పై హక్కులు కల్పిస్తామని రాహుల్ అన్నారు.

Also Read : Posani Krishna Murali : అది నిరూపిస్తే.. చంద్రబాబు కాళ్లు కడిగి వెంటనే టీడీపీలో చేరతా- పోసాని కృష్ణమురళి

ఢిల్లీలో ఈసారి ప్రజాప్రభుత్వం ఏర్పడబోతుంది. జాతీయ ఉపాధిహామీ కూలీ 400కు పెంచుతాం. దేశంలో ఉన్న 90శాతం పేదల తలరాతలు మారుస్తామని రాహుల్ గాంధీ చెప్పారు. రిజర్వేషన్లు 50శాతం దాటాలి. అధికారంలోకి రాగానే 50శాతం నిబంధన ఎత్తేస్తాం. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరణచేసి, రిజర్వేషన్ల ఫలాలు అందకుండా బీజేపీ కుట్ర చేస్తుందని రాహుల్ విమర్శించారు. మోదీ ఇప్పటి వరకు 50శాతం రిజర్వేషన్ల పొడగింపుపై ఎందుకు మాట్లాడలేదో చెప్పాలని రాహుల్ ప్రశ్నించారు. దేశంలో ధనికుల ప్రభుత్వం నడుస్తుంది. దేశంలో మత విద్వేషాలు రెచ్చగొట్టి అన్నదమ్ముల మధ్య చిచ్చు పెడుతున్నారంటూ బీజేపీ ప్రభుత్వంపై రాహుల్ విమర్శలు చేశారు.