సీఆర్పీఎఫ్ డీజీ సెల్ఫ్ క్వారంటైన్
సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్పీఎఫ్) చీఫ్ AP మహేశ్వరి సెల్ఫ్ క్వారంటైన్(స్వీయ నిర్బంధం) అయ్యారు. ఫోర్సెస్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ కు గురువారం కరోనా వైరస్ పాజిటివ్ అని తేలడంతో డాక్టర్ల సూచన మేరకు ఆయన క్వారెంటైన్లోకి వెళ్లారు. సీఆర్పీఎఫ్ చీఫ్తో పాటు వైద్యుడికి దగ్గరగా మెలిగిన మరో 20 మందిని కూడా అధికారులు క్వారెంటైన్ కేంద్రానికి తరలించారు.
ముందస్తు జాగ్రత్తగా వీరి నమూనాలను వైద్యులు సేకరించి.. పరీక్షా కేంద్రాలకు పంపారు. కాగా సీఆర్పీఎఫ్ చీఫ్కు వైద్య సేవలు అందించే డాక్టర్కు కరోనా సోకడంతో అధికారులు అలర్ట్ అయ్యారు. దీనిలో భాగంగానే ఆయనతో మెలిగిన దాదాపు 20మందికి కొవిడ్-19 టెస్ట్ లు చేయగా,వారికి నెగిటివ్ గా తేలింది. మరోవైపు హోంమంత్రిత్వశాఖ సీనియర్ సెక్యూరిటీ అడ్వైజర్ కే.విజయ్ కుమార్ తెలిపారు.