‘గురు స్మరణలో’ పుస్తకాన్ని ఆవిష్కరించిన సీఎం జగన్
సుప్రసిద్ధ భాషావేత్త, ఆంధ్రప్రదేశ్లో వందల మంది సీనియర్ పాత్రికేయులకు గురువు బూదరాజు రాధాకృష్ణ. ఆయన 88వ జయంతి సందర్భంగా ఆయన శిష్య బృందం తీసుకొచ్చిన కవితా సంకలనం ‘‘గురు స్మరణలో’’. ఈ పుస్తకాన్ని ఏపీ సీఎం జగన్ శనివారం(మే 2,2020) తన క్యాంపు కార్యాలయంలోని ఛాంబర్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బూదరాజు సేవలను సీఎం జగన్ స్మరించుకున్నారు.
పత్రికా రంగానికి, తెలుగు భాషకు బూదరాజు సేవలు చిరస్మరణీయమని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ప్రజా వ్యవహారాల సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, కమ్యూనికేషన్స్ సలహాదారు జీవీడీ కృష్ణ మోహన్ పాల్గొన్నారు.
‘బూరా బృందం’ గా పిలుచుకునే బూదరాజు శిష్యులు పి.మధుసూదన్, ముని సురేష్ పిళ్ళె, ఎస్.రాము ఈ సంకలనాన్ని అందుబాబులోకి తీసుకొవచ్చారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలుపుతూ… కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమానికి తాము హాజరు కాలేకపోయామని తెలిపారు.
Also Read | ఏపీలో 1500 దాటిన కరోనా కేసులు, కొత్తగా 62మందికి కొవిడ్