Anasuya : పవన్, కొడాలి ఫ్యాన్స్ వార్ మధ్యలో అనసూయ.. ఏమన్నదంటే..?

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్యాన్స్ వార్ మధ్యలోకి నటి అనసూయ రావాల్సి వచ్చింది. ఆమె చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Anasuya : పవన్, కొడాలి ఫ్యాన్స్ వార్ మధ్యలో అనసూయ.. ఏమన్నదంటే..?

Anasuya viral tweet between Pawan Kalyan Kodali Nani Fans war

Anasuya : టాలీవుడ్ యాక్ట్రెస్ అనసూయ సోషల్ మీడియాలో ఫుల్ యాక్టీవ్ గా ఉంటుంది. ఏదొక విషయం పై రియాక్ట్ అవుతూ ఆమె చేసే పలు పోస్టులు నెట్టింట వైరల్ గా మారుతుంటాయి. తాజాగా ఈమె జనసేన అధినేత పవన్ కళ్యాణ్, వైసీపీ నేత గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఫ్యాన్స్ వార్ మధ్యలోకి రావాల్సి వచ్చింది. ప్రస్తుతం ఆమె చేసిన ఒక ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. ఇంతకీ అసలు అనసూయ ఈ ఫ్యాన్ వార్ లోకి ఎలా ఎంట్రీ ఇచ్చింది..?

అసలు ఏం జరిగిందంటే.. ఇటీవల దివంగత నేత వంగవీటి మోహనరంగా తనయుడు, మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ వివాహం ఘనంగా జరిగిన సంగతి అందరికి తెలిసిందే. కృష్ణా జిల్లాలోని పోరంకిలో జరిగిన ఈ పెళ్ళికి పవన్ కళ్యాణ్, కొడాలి నాని, వల్లభనేని వంశీతో పాటు మరికొందరు రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. కాగా ఆ పెళ్ళికి పవన్ కళ్యాణ్ వచ్చిన సమయంలో ఫ్యాన్స్ తాకిడితో గందరగోళ పరిస్థితి నెలకుంది.

Also read : Shraddha Kapoor : ఖరీదైన కార్ కొన్న బాలీవుడ్ హీరోయిన్.. వామ్మో ఒక్క కారుకే అన్ని కోట్లా?

ఆ గందరగోళ పరిస్థితికి సంబంధించిన ఒక వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దానిపై పవన్, కొడాలి ఫ్యాన్స్ చర్చింకుంటూ ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఒక నెటిజెన్.. ‘అనసూయ, రష్మీ వచ్చినా అలాగే ఎగబడతారు’ అంటూ కామెంట్స్ చేశాడు. ఇక ఈ కామెంట్ పైనే అనసూయ రియాక్ట్ అవుతూ ట్వీట్ చేసింది.

“అగౌరవంగా మా పేర్లను ఇలా ఒక టాపిక్ లోకి లాగటం తప్పండి. జనాలు మమ్మల్ని చూడడానికి ఎగబడడానికి కారణం.. మేము లైఫ్ లో ఏదో సాధించి ఒక స్థాయికి చేరుకున్నాం. అలాంటి మేము ఎలా ఉంటామో చూడాలనే ఆసక్తితో ఎగబడతుంటారు. మీరు మా పేర్లను ఉపయోగించినంత సులువు కదండీ.. మేము ఈ స్థాయికి రావడం. మా జర్నీ గౌరవించండి” అంటూ అనసూయ ట్వీట్ చేసింది. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.