Anchor Syamala : నాకు భయమేస్తుంది.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు..
తాజాగా యాంకర్ శ్యామల ఏపీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
![Anchor Syamala : నాకు భయమేస్తుంది.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు.. Anchor Syamala : నాకు భయమేస్తుంది.. బెదిరింపు కాల్స్ వస్తున్నాయి.. యాంకర్ శ్యామల సంచలన వ్యాఖ్యలు..](https://10tv.in/wp-content/uploads/2024/06/anchor-syamala.jpg)
Anchor Syamala First Time Reacts on AP Elections Results She Blaming Received Threat Calls
Anchor Syamala : యాంకర్ శ్యామల వైసీపీ పార్టీకి సపోర్ట్ చేస్తుందని అందరికి తెలిసిందే. ఏపీ ఎన్నికల ముందు వైసీపీకి సపోర్ట్ గా ఎన్నికల ప్రచారంలో కూడా తిరిగింది. దాదాపు చాలా నియోజక వర్గాల్లో శ్యామల ప్రచారం చేసింది. అయితే చాలా మంది సినిమా వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్లకు వారు ప్రచారం చేసుకున్నారు. కాని యాంకర్ శ్యామల ఎన్నికల ముందు ఓ ఇంటర్వ్యూలో పవన్ కళ్యాణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది. దీంతో శ్యామల వ్యాఖ్యలు వైరల్ అవ్వడంతో పవన్ ఫ్యాన్స్ బాగా ట్రోల్ చేసారు.
ఇప్పుడు ఏపీ ఎన్నికల్లో టీడీపీ – బీజేపీ – జనసేన కూటమి గెలవడం, పవన్ కళ్యాణ్ భారీ మెజార్టీతో పిఠాపురంలో గెలవడం, జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లోనూ గెలవడంతో యాంకర్ శ్యామల పవన్ కళ్యాణ్ పై చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ మరోసారి ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ఇక కొంతమంది శ్యామలను బెదిరిస్తున్నారని కూడా వార్తలు వస్తున్నాయి. తాజాగా యాంకర్ శ్యామల ఏపీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడుతూ ఓ వీడియో రిలీజ్ చేసింది.
Also Read : Rakshana Review : పాయల్ రాజ్ పుత్ ‘రక్షణ’ మూవీ రివ్యూ.. పోలీసాఫీసర్ గా పాయల్ మెప్పించిందా?
అయితే యాంకర్ శ్యామల ఈ వీడియోలో మాట్లాడుతూ.. నాకు బెదిరింపు కాల్స్ వస్తున్నాయి. చాలా బెదిరిస్తున్నారు. ఒకరకమైన భయంగానే ఉంది నాకు. కాని మీకు ఒకటి నచ్చుతుంది, నాకు ఒకటి నచ్చుతుంది. మీకు నచ్చినట్లు నేను లేనని బతకడానికి వీల్లేదు అంటే ఎలా? దయచేసి వ్యక్తిగతంగా తీసుకోవద్దు, నేను వ్యక్తిగతంగా ఎవరిపైన విమర్శలు చేయలేదు, చేయను కూడా. మీరు కూడా పర్సనల్ తీసుకోవద్దు. నాకు నచ్చిన పార్టీని గెలిపించే ప్రయత్నంలో నేను చేయాల్సింది చేశాను. ఉన్నదే చెప్పను, లేనిది ఎక్కడా చెప్పలేదు. దయచేసి మీరు అర్ధం చేసుకుంటారని భావిస్తున్నాను అని తెలిపింది.
ప్రియమైన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమస్తే..
ఎన్నికల్లో ఏపీ ప్రజలు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నా..ఎన్నికల క్షేత్రం లో ప్రజల తీర్పే అంతిమం…ఈ ఎన్నికల్లో విజయం సాధించిన కూటమికి పెద్దలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి ,పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ పెద్దలకు హృదయ పూర్వక శుభాకాంక్షలు.. pic.twitter.com/tEfjUmshLW
— Anchor Shyamala (@AnchorShyamala) June 7, 2024
అయితే పవన్ పై డైరెక్ట్ గా విమర్శలు చేసిన శ్యామల ఇప్పుడు ఎవరిపై విమర్శలు చేయలేదు అంటూ మాట్లాడటంతో మరోసారి శ్యామలను ట్రోల్ చేస్తున్నారు పవన్ ఫ్యాన్స్. ప్రస్తుతం శ్యామల రిలీజ్ చేసిన వీడియో వైరల్ గా మారింది.