Mint Farm : పుదీనా సాగులో యాజమాన్య పద్ధతులు

వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మాగిన పశువుల ఎరువు 70 కిలోలకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి మరియు 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి.

Mint Farm : పుదీనా సాగులో యాజమాన్య పద్ధతులు

Green Mint Plant In Growth At Vegetable Garde

Mint Farm : ఆకు కూరల్లో పుదీనా ఔషదగుణాలు కలిగిన మొక్క. దీని ఆకులను సువాసన కోసం, సుగంధ ద్రవ్యంగా, పచ్చళ్ళలో, సలాడ్ ల తయారీలో ఉపయోగిస్తారు. ఆకు కూరగానే కాక పుదీనా నుండి నూనెను తీసి పలు రకాలుగా వినియోగిస్తారు. పుదీనా మొక్క సుమారు 40 సెం.మీ ఎత్తు వరకు పెరుగుతుంది. పుదనా కాండం నుండి తీసే నూనెను మెంథాల్ అంటారు. మెంథాల్ ను ఔషధాల తయారీలో , షేవింగ్ , టూత్ పేస్ట్ ల తయారీలో ఉపయోగిస్తారు. పుదీనా సాగుకు సమశీతోష్ణ ఉష్ణ ప్రాంతాలు అనువైనవి. సారవంతమైన అధిక సేంద్రీయ పదార్ధాలుగల తేలిక పాటి ఇసుక నేలలు, నుండి మురుగు నీరు పోయే వసతిగల తేలిక పాటి ఒండ్రునేలలు అనుకూలంగా ఉంటాయి. నీరు నిలిచే పల్లపు నేలలు సాగుకు పనికి రావు.

పుదీనా సాగులో ప్రధానంగా నాలుగు రకాలున్నాయి. జపనీస్ మింట్, స్పియర్ మింట్, పెప్పర్ మింట్, బెర్గామాట్ మింట్ గించేది. మార్కెట్లో మనకు లభించేది మాత్రమం స్పియర్ మింట్ రకం. పుదీనాను కాండం, ముక్కలుగా నాటుకోవటం ద్వారా సాగు చేసుకోవచ్చు. వేరుతో గల కాండం ముక్కలు 4 నుండి 5 సెం.మీ పొడవుతో 2 కణుపులు కలిగిన మొక్కలు ఎన్నుకోవాలి. ఎకరాకు 4క్వింటాళ్ళ కాండం ముక్కలు అవసరం అవుతాయి. కాండం ముక్కలను కార్బండిజమ్ 1గ్రా లీటరు నీటికి లేదా కాప్టాన్ 3గ్రా లేదా, కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి కలిపిన ద్రావణంలో 10 నిమిషాలు ఉంచి నాటుకోవడం వల్ల వేరుకుళ్లును అరికట్టవచ్చు. ఆకు కూరకోసం సంవత్సరం పొడవునా పొదినాను నాటుకోవచ్చు.

సస్యరక్షణ చర్యలు ;

ఆకు కూరకోసం సాగుచేసే సదర్భంలో వీలైనంత వరకు ఎలాంటి క్రిమి సంహారక మందులు వాడకపోవటం మంచిది. వేప సంబంధిత క్రిమి సంహార కాలను ఉపయోగించడం శ్రేయస్కరం. తప్పనిసరైతే ఆకుతినే పురుగుల నివారణకు మలాథియాన్ 2మి.లీ లేదా నువాన్ 2మి.లీ లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి. పుదీనాలో తెగుళ్ళ సమస్య తక్కువగానే ఉంటుంది. నేల ద్వారా సంక్రమించే కాండం కుళ్ళును అరికట్టడానికి పంట మార్పిడిని పాంటించాలి. పుదీనాను మొక్కజొన్న, ఆలుగడ్డ, వరి, చిరుధాన్యపు లాంటి పంటలతో పంట మార్పిడి చేయాలి. కాండం కుళ్లు నివారణకు విత్తనశుద్ధి పాటించాలి. ఆకు మాడు తెగులు నివారణకు కాపర్ ఆక్సీక్లోరైడ్ 3గ్రా లీటరు నీటికి కలిపి పిచికారి చేయాలి.

వేసవిలో ఎండు తెగులు ఎక్కువగా ఆశిస్తుంది. దీని నివారణకు మాగిన పశువుల ఎరువు 70 కిలోలకు 2 కిలోల ట్రైకోడెర్మావిరిడి మరియు 10 కిలోల వేపపిండి కలిపి నీళ్లు చల్లి వారం రోజులు మాగనిచ్చిన తరువాత ఆఖరి దుక్కిలో వేసి కలియ దున్నాలి. ఇలా చేయటం వల్ల ఈ తెగులును అరికట్టవచ్చు. పంటమార్పిడి తప్పనిసరిగా పాటించాలి. నాటిన 3నెలలకు మొదటి కోత వస్తుంది. మొదటి కోతలో మొక్కల మొదళ్లను 5సెం.మీ వదిలిపెట్టి కోయాలి. రెండవ కోత భూమికి దగ్గరగా కోయాలి. రెండు కోతల్లో ఆకు దిగుబడి ఎకరాకు 10 నుండి 12టన్నులు వస్తుంది. నూనె దిగుబడి ఎకరాకు 65 నుండి 75 కిలోలు వస్తుంది.