Supreme Court : ‘AP హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోం’..జీవో నెంబర్ 1 కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశం

జీవో నంబర్ 1 కేసుపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో తాము జోక్యం చేసుకోం అని..ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారణ చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

Supreme Court : ‘AP హైకోర్టు తీర్పుపై జోక్యం చేసుకోం’..జీవో నెంబర్ 1 కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని సుప్రీంకోర్టు ఆదేశం

Ap government GO number 1 case has been ordered by the Supreme Court

Supreme Court :  జీవో నెంబర్ 1 పై  ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ  ఏపీ ప్రభుత్వం  దాఖలు చేసిన స్పెషల్  లీవ్ పిటిషన్ పై శుక్రవారం (జనవరి 20,2023)న సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. జీవో నంబర్ 1 పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు విషయంలో జోక్యం చేసుకోం అంటూ తేల్చి చెప్పింది. అనంతరం ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ జనవరి (2023)23న విచారణ జరిపించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీంకోర్టు ఆదేశంతో మరోసారి ఈకేసు తిరిగి ఏపీ హైకోర్టుకే రానుంది.అలాగే ఏపీ హైకోర్టు తీర్పు మెరిట్స్ పై ఎటువంటి అభిప్రాయం వ్యక్తం చేయలేదని సీజే వ్యాఖ్యానించారు. అలాగే జీవో నెంబర్ 1పై ఇచ్చిన స్టేను ఎత్తివేయడానికి సుప్రీంకోర్టు నిరాకరిస్తూ..ఇటువంటి సమయంలో ఈ కేసుపై తాము జోక్యం చేసుకోలేమని దేశ అత్యున్నత ధర్మాసనం స్పష్టంచేసింది.

ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు తమకు అనుకూలంగా లేకపోవటంతో సుప్రీంకోర్టును ఆశ్రయించిన ఏపీ ప్రభుత్వానికి మరోసారి సుప్రీంకోర్టు ఝలక్ ఇచ్చినట్లైంది. ఈ కేసు విచారణ సందర్భంగా సీజే జీవో నెంబర్ 1పై ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై తాము జోక్యం చేసుకోలేమని తేల్చి చెప్పింది.  కాగా ఏపీలో విపక్ష పార్టీల్లో సెగలు రేపుతున్న జీవో నెంబర్ 1ని వ్యతిరేకిస్తూ.. సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ జనవరి 12న ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు వైసీపీ ప్రభుత్వం తెచ్చిన జీవోనెంబర్ 1 పోలీస్ యాక్ట్ 30కి అనుగుణంగా లేదని వ్యాఖ్యానించింది. జీవో నెంబర్ 1ను సస్పెండ్ చేస్తూ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై అసంతృప్తి వ్యక్తంచేసిన వైసీపీ ప్రభుత్వం ఈకేసును సుప్రీంకోర్టులో జనవరి 17వ తేదీన స్పెషల్ లీవ్ పిటిషన్ ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ పై విచారణ నిర్వహించిన సుప్రీంకోర్టు ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై జోక్యం చేసుకోలేమని ఈ కేసును హైకోర్టు చీఫ్ జస్టిస్ జనవరి 23న విచారణ చేపట్టాలని ఆదేశించింది. సుప్రీం ఆదేశంతో మరోసారి ఈ కేసు ఏపీ హైకోర్టులోనే విచారణ జరగనుంది.

కాగా ప్రకాశం జిల్లా కందుకూరులోను..గుంటూరులోను టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు నిర్వహించిన సభల్లో తొక్కిసలాటలు జరిగాయి. ఈ తొక్కిసలాటల్లో మొత్తం 11మంది చనిపోయారు. కందుకూరులో సభలో ఎనిమిది మంది, గుంటూరులో తొక్కిసలాటలో ముగ్గురు మృతి చెందారు. దీంతో రోడ్లపై రోడ్ షోలు, ర్యాలీలు, సభలు నిర్వహించడంపై నిషేధిస్తూ వైసీపీ ప్రభుత్వం జనవరి (2023) 2న జీవో నెంబర్ 1ని జారీ చేసింది. ఈ జీవోపై విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించాయి. వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు కురిపించాయి. విపక్షాలను టార్గెట్ చేయటానికే బ్రిటీష్ కాలంనాటి జీవో తీసుకొచ్చారంటూ వివర్శించాయి. కానీ వైసీపీ ప్రభుత్వం ప్రజల క్షేమం కోసమే ఈ జీవో అంటూ సమర్థించుకుంది.

ఈ జీవో నెంబర్ 1ని ఆధారంతో చంద్రబాబు తన సొంత నియోజకవర్గం అయిన కుప్పం పర్యటనను పోలీసులు అడ్డుకున్నారు. ప్రచార వాహనాన్ని సీజ్ చేశారు. పోలీసుల తీరును చంద్రబాబు తప్పుబట్టి రోడ్డుమీదనే బైఠాయించి ధర్నా చేశారు. అలాగే జీవోను జనసేన కూడా తప్పుపట్టింది. ఎన్నికల వాహనంగా జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ప్రత్యేకంగా ఓ బస్సును సిద్ధం చేసుకున్నారు. దానికి వారాహి అని పేరు పెట్టారు. ఈ బస్సుపై పవన్ యాత్ర చేస్తే అడ్డుకుంటామని వైసీపీ నేతలు ప్రకటించారు.

అలాగే జనవరి 27 నుండి లోకేష్ పాదయాత్ర ప్రారంభించనున్నారు. లోకేశ్ పాదయాత్రను అడ్డుకోవటానికి..పవన్ కల్యాణ్ వారాహి యాత్రను అడ్డుకోవటానికే ఈ జీవో నంబర్ 1ను వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది అంటూ విమర్శలు వస్తున్నాయి. ఈక్రమంలో సుప్రీంకోర్టు మరోసారి వైసీపీ ప్రభుత్వానికి షాక్ ఇచ్చినట్లైంది. ఈ కేసును ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ విచారించాలని స్పష్టంచేయటంతో ఈకేసు తిరిగి ఏపీ హైకోర్టుకే చేరింది. మరి ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ఈ జీవోపై ఎటువంటి తీర్పుని ఇవ్వనున్నారో వేచి చూడాలి.