Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ అధినేత

ఆ ప్రాంతంలో ఓ రావణాసురుడు ఉన్నాడని, ఇక్కడి రావణాసురుడికి ట్యాగ్ ఎమ్మెల్యే అని అన్నారు.

Chandrababu Naidu: చంద్రబాబు పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత.. ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వార్నింగ్ ఇచ్చిన టీడీపీ అధినేత

Chandrababu Naidu

Chandrababu Naidu – TDP: ఆంధ్రప్రదేశ్‌లోని (Andhra Pradesh) అన్నమయ్య జిల్లా (Annamayya district) కురబలకోట మండలం అంగళ్లులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడి పర్యటన వేళ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చించేశారు.

దీంతో అక్కడ ఉద్రిక్తత చెలరేగి, ఓ టీడీపీ కార్యకర్త గాయపడ్డారు. ఆయన ముఖంపై గాయాలయ్యాయి. గాయాలతోనే ఆయన వైసీపీపై మండిపడ్డారు. ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించాలని చంద్రబాబు నాయుడు సూచించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ… ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.

ఆ ప్రాంతంలో ఓ రావణాసురుడు ఉన్నాడని, ఇక్కడి రావణాసురుడికి ట్యాగ్ ఎమ్మెల్యే అని చంద్రబాబు అన్నారు. పోలీసులపై చంద్రబాబు మండిపడ్డారు. కాగా, తంబళ్లపల్లె (Thamballapalle) నియోజకవర్గంలో చంద్రబాబు పర్యటించి పలువురితో మాట్లాడారు. నాయిని చెరువు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ను చంద్రబాబు పరిశీలించారు.

చంద్రబాబు పులివెందుల టూర్ భారీ సక్సెస్ కావడంతోనే, పుంగనూరులో సైకో గ్యాంగ్ ని రంగంలోకి దింపారంటూ టీడీపీ ఆరోపణలు చేస్తోంది. చంద్రబాబుపై దాడి చేయడానికి పెద్దిరెడ్డి అండ్ తాడేపల్లి సైకో బ్యాచ్ ప్లాన్ వేసుకుని, ఆ ప్రయత్నాలు చేశారని అంటోంది.

Manthani Constituency: మంథనిలో కాంగ్రెస్ ధీమా.. మరో చాన్స్ ఇవ్వమంటున్న మధు.. బీజేపీ పరిస్థితి ఏంటి?