Thirumala : శ్రీవారి భక్తులకు శుభవార్త.. కాలినడకన అలిపిరి నుంచి తిరుమలకు
తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పైకప్పు నిర్మాణం, విద్యుత్ తోపాటు వాటర్ వర్క్స్ పనులు దాదాపు పూర్తయ్యాయి.

footpath from Alipiri to Thirumala : తిరుమల శ్రీవారి భక్తులకు శుభవార్త. అలిపిరి నుంచి తిరుమల కాలినడక మార్గం నిర్మాణ పనులు చివరి దశకు చేరాయి. పైకప్పు నిర్మాణాన్ని పూర్తిచేయడంతో పాటు విద్యుత్, వాటర్ వర్క్స్ పనులు దాదాపు పూర్తయ్యాయి. దీంతో ఈ నెల 11 నుంచి నడక మార్గాన్ని టీటీడీ భక్తులకు అందుబాటులోకి తీసుకురానుంది.
తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రతీరోజు వేల సంఖ్యలో భక్తులు వస్తుంటారు. నడక మార్గంలో వెళ్లి మొక్కులు చెల్లించుకునే భక్తులు కూడా పెద్ద సంఖ్యలో ఉంటారు. అలిపిరి నడక మార్గంలో మరమ్మతులు, ఆధునీకరణ పనుల కోసం గతేడాది సెప్టెంబరులో పనులు ప్రారంభంకాగా.. దాదాపు పూర్తయయ్యాయి. పనులు వేగవంతం చేయడం కోసం .. ఈ ఏడాది జూన్ 1 నుంచి భక్తులకు అనుమతిని రద్దుచేసింది.. టీటీడీ. ప్రస్తుతం శ్రీవారి మెట్టు మార్గం నుంచి తిరుమలకు నడకదారి భక్తులు వెళ్తున్నారు.
Tirupati Brahmotsavam 2021: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు.. హంస వాహనంపై స్వామివారు
అలిపిరి నడకదారిపైన దశాబ్దాల క్రితం నిర్మించిన పైకప్పు శిథిలావస్థకు చేరుకుంది. దీంతో అలిపిరి మెట్ల మార్గంలో పైకప్పును కొత్తగా నిర్మించాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. అందుకు అయ్యే మొత్తం ఖర్చు 25 కోట్ల రూపాయలను.. టీటీడీకి విరాలంగా ఇవ్వడానికి .. రిలయన్స్ ఇండస్ట్రీస్ సంస్థ ముందుకు వచ్చింది. అలిపిరి పాదాల మండపం వద్ద నుంచి గాలిగోపురం వరకు 1.4 కిలోమీటర్ల మేర మెట్ల దారిలో.. 7.5 కోట్ల వ్యయంతో గాల్వలూమ్ షీట్లను ఏర్పాటు చేశారు.
CM Jagan : సీఎం జగన్ తిరుపతి పర్యటన
ఇక గాలి గోపురం నుంచి నరసింహ స్వామి ఆలయం వరకు 3 కిలోమీటర్ల మేర పైకప్పుకు .. ఆర్సీసీ స్లాబ్ ఏర్పాటు చేశారు. ఇందుకోసం 17.5 కోట్ల రూపాయలు కేటాయించారు. నడకదారిలోని నరసింహస్వామి వారి ఆలయం నుంచి తిరుమల వరకు ఉన్న పైకప్పు కొత్తగా నిర్మించినదే కావడంతో దానికి ఎటువంటి మరమ్మత్తులు నిర్వహించలేదు.
తిరుపతిలోని శ్రీనివాసం అలిపిరి వద్ద నుంచి నడిచి వెళ్ళే మొక్కులు చెల్లించుకుని భక్తుల కోసం.. ఇప్పటివరకూ శ్రీవారి మెట్టు వరకు ఉచిత బస్సులను టీటీడీ ఏర్పాటు చేసింది. ఈ నెల 11న ముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి చేతులమీదుగా నడకదారి ప్రారంభించడానికి టీటీడీ సన్నాహాలు చేస్తోంది. మరో రెండు రోజుల్లో అలిపిరి మార్గం ఓపెన్ అవుతుండటంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
- Chardam Vicinity Plastic : చార్దామ్ యాత్రలో ప్లాస్టిక్తో ముప్పు
- దావోస్లో సీఎం జగన్ బిజీ బిజీ
- Pawan Kalyan On PetrolPrices : దేశంలో ఏపీలోనే పెట్రో ధరలపై పన్నులు ఎక్కువ, తగ్గించాలని పవన్ కళ్యాణ్ డిమాండ్
- Bengaluru Crime : బెంగళూరులో కారు బీభత్సం.. పాదాచారులపైకి దూసుకెళ్లిన కారు.. షాకింగ్ వీడియో..!
- Dr BR Ambedkar : కోనసీమ జిల్లా పేరు..డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మార్పు
1NTR : ఫిల్మ్నగర్ లో ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ.. తరలి రానున్న ఎన్టీఆర్ కుటుంబం..
2Major : మేజర్ టికెట్ రేట్స్ చాలా తక్కువ.. సరికొత్తగా ప్రమోట్ చేస్తున్న అడివి శేష్..
3NTR : ఎన్టీఆర్ ఘాట్ వద్ద నివాళులు అర్పించిన లక్ష్మి పార్వతి
4NTR : ఎన్టీఆర్ ఘాట్ను సందర్శిన జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్
5Virender Sehwag: “ఆ మ్యాచ్లు ఆడకపోతే పంత్ను పట్టించుకోరు”
6CoWIN: కొవిన్ అంటే కొవిడ్ ఒక్కదానికే కాదు..!!
7RBI: మూడేళ్లుగా రూ.2వేల నోట్ల ముద్రణ ఆపేయడానికి కారణం.. రద్దేనా
8IPL2022 Rajasthan Vs RCB : బెంగళూరుపై బట్లర్ బాదుడు.. ఫైనల్కు రాజస్తాన్
9Telangana Covid News : తెలంగాణలో కొత్తగా ఎన్ని కరోనా కేసులు అంటే..
10IPL2022 RR Vs Bangalore : మళ్లీ రాణించిన రజత్ పాటిదార్.. రాజస్తాన్ ముందు మోస్తరు లక్ష్యం
-
Mahesh Babu: మహేష్ కోసం జక్కన్న అక్కడి నుండి దింపుతున్నాడా..?
-
Nepal – USA ties: 20 ఏళ్ల తరువాత అమెరికా పర్యటనకు నేపాల్ ప్రధాని: చైనాకు ఇక దడే
-
NTR31: తారక్ ఫ్యాన్స్ కొత్త రచ్చ.. ఆ హీరోయినే కావాలట!
-
ISIS Terrorist: ఐసిస్ ఉగ్రవాదికి ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష విధించిన ముంబై స్పెషల్ కోర్ట్
-
Sarkaru Vaari Paata: ‘సర్కారు వారి పాట’ ఓటీటీలో వచ్చేది అప్పుడేనా..?
-
Pilot loses Cool: రన్వేపైనే 7 గం. పాటు విమానం: పైలట్ ఏం చేశాడో తెలుసా!
-
Ram Charan: ఆ డైరెక్టర్కు ఎదురుచూపులే అంటోన్న చరణ్..?
-
Southwest Monsoon: వాతావరణశాఖ చల్లటి కబురు: మే 29న కేరళను తాకనున్న నైరుతి రుతుపవనాలు