AP : క్లీన్ ఏపీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం…ఇంటింటికి మూడు డస్ట్ బిన్‌‌లు

గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జరుగనుంది.

AP : క్లీన్ ఏపీ, జగనన్న స్వచ్ఛ సంకల్పం…ఇంటింటికి మూడు డస్ట్ బిన్‌‌లు

Ap Jagan

Updated On : October 2, 2021 / 10:04 AM IST

CM YS Jagan : పరిశుభ్రత రాష్ట్రం ఏదైనా ఉందంటే..అది ఏపీ రాష్ట్రం అని చెప్పుకొనే విధంగా..స్వచ్ఛ సంకల్పానికి శ్రీకారం చుడుతోంది. గ్రామీణ, పట్టణ, నగర ప్రజలకు మెరుగైన పారిశుధ్య సేవలు అందించడమే లక్ష్యంగా క్లీన్ ఆంధ్రప్రదేశ్ (క్లాప్) జగనన్న స్వచ్ఛ సంకల్పం కార్యక్రమం జరుగనుంది. 2021, అక్టోబర్ 02వ తేదీ గాంధీ జయంతి సందర్భంగా శనివారం విజయవాడ బెంజి సర్కిల్ వద్ద సీఎం జగన్ లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా…4 వేల 097 చెత్త సేకరణ వాహనాలను జెండా ఊపి ప్రారంభించనున్నారు. క్లాప్ కార్యక్రమంలో గార్బేజ్‌ ఫ్రీ, బిన్‌ ఫ్రీ, లిటర్‌ ఫ్రీ రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్ది జాతీయ స్థాయి స్వచ్ఛ సర్వేక్షణ్‌ పోటీల్లో ఉత్తమ ర్యాంక్‌ సాధించే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Read More : Babu Mohan : పవన్, పోసాని ఇండస్ట్రీ పరువు తీస్తున్నారు.. బాబు మోహన్ ఫైర్

ఇంట్లోనే తడి, పొడి ప్రమాదకర చెత్తను వేరే చేసేలా ప్రతింటిక మూడు డస్ట్ బిన్ లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది. 123 కార్పొరేషన్ లు, మున్సిపాల్టీలోని 40 లక్షల నివాసాలకు 1.20 కోట్ల డస్ట్ బిన్ లను పంపిణీ చేయనున్నారు. ఇందుకు రూ. 100 కోట్లు నిధులు వెచ్చిస్తోంది. అంతేగాకుండా..జనాలు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో 1500 పబ్లిక్ టాయిలెట్లను నిర్మించనున్నారు. పరిశుభ్రత కోసం 10,731 హై ప్రెజర్‌  టాయిలెట్‌ క్లీనర్లు కేటాయించారు. చెత్త సేకరించడం, తరలించడం కోసం 3 వేల 097 ఆటో టిప్పర్లు,  1771 ఎలక్ట్రిక్ ఆటోలను పంపిణీ చేయనున్నారు. సేకరించిన చెత్తను 5 వేల 868 జీపీఎస్ ఆధారిత గార్బేజ్ ద్వారా గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ లకు తరలించనున్నారు. 124 మున్సిపాల్టీల్లో 231 గార్బేజ్ ట్రాన్స్ ఫర్ స్టేషన్ (జీటీఎస్)లు ఏర్పాటు చేయడంతో పాటు…72 మున్సిపాల్టీలలో ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ ప్రాజెక్టుల కోసం ఏజెన్సీల ఖరారుకు ఇప్పటికే  టెండర్లు పిలిచారు.

Read More : Ladakh standoff: లడఖ్‌పై భారత్, చైనా మాటల యుద్ధం

రాష్ట్రంలోని 65 నాన్‌ అమృత్‌ సిటీలలో సెప్టిక్‌ ట్యాంక్‌ల నుంచి సేకరించిన వ్యర్థాలను శుద్ధి చేసేందుకు ఫీకల్‌ స్లడ్జ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్లు (ఎఫ్‌ఎస్‌టీపీ) ఏర్పాటు చేయనున్నారు. చెత్త సేకరణ, రవాణా, శుద్ధీకరణ, పరిసరాల పరిశుభ్రతకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోంది. ఈ కేంద్రాల వద్ద నలుగురు చొప్పున సిబ్బంది నియమించి…జీత భత్యాలు, నిర్వహణకు చర్యలు చేపట్టనున్నారు. కొత్తగా 4 వేల 171 చెత్త నుంచి సంపద తయారు చేసే..కేంద్రాలను నిర్మించనున్నారు. 6,417 ఇన్సినరేటర్‌ పరికరాలను. 10,645 పంచాయతీలలో వర్మి కంపోస్ట్‌ నిర్వహణ, నాన్‌ రీసైక్లింగ్‌ వ్యర్థాలను సమీపంలోని సిమెంట్‌ ఫ్యాక్టరీలు, దోమల నివారణకు 10,628 థర్మల్‌ ఫాగింగ్‌ మిషన్లు పంపిణీ చేపడతారు.