Ladakh standoff: లడఖ్‌పై భారత్, చైనా మాటల యుద్ధం

తూర్పు లడఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు భారత్‌ని బాధ్యుడిని చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ladakh standoff: లడఖ్‌పై భారత్, చైనా మాటల యుద్ధం

Ladakh (1)

Ladakh standoff: తూర్పు లడఖ్‌లో నెలకొన్న ప్రతిష్టంభనకు భారత్‌ని బాధ్యుడిని చేసేందుకు చైనా చేస్తున్న ప్రయత్నాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. చైనా రెచ్చగొట్టే ప్రవర్తన శాంతికి భంగం కలిగించిందని చైనా ఆరోపణలకు భారత్ తగిన సమాధానం ఇచ్చింది. చైనా సైన్యం “రెచ్చగొట్టే” ప్రవర్తన మరియు వాస్తవ నియంత్రణ రేఖ(LAC)లో స్థితిని మార్చడానికి “ఏకపక్షంగా” ప్రయత్నించడం వల్లే సరిహద్దుల్లో శాంతిభద్రతలకు విఘాతం ఏర్పడినట్లుగా భారత్ చెబుతోంది.

రెండు దేశాల సరిహద్దుల వెంట చైనా సైన్యమే నిరంతరం అతిక్రమణకు దిగుతోందని, ప్రతిస్పందనగా భారత దళాలు అప్రమత్తమైనట్లుగా ప్రభుత్వం చెబుతోంది. చైనా విదేశాంగశాఖ ప్రతినిధి హువా చున్యింగ్ బీజింగ్‌లో మాట్లాడుతూ భారత్‌పై నోరుపారేసుకోవడమై, లడఖ్‌ సరిహద్దుల్లో గతేడాది నుంచి నెలకొన్న ఉద్రిక్తతలకు మూలకారణం ఢిల్లీనేనని, వాస్తవాధీన రేఖను దాటి వచ్చి చైనా భూభాగాన్ని భారత్‌ ఆక్రమిస్తోందని ఆరోపించారు. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలకు “మూల కారణం” భారతదేశ “ప్రొసీడింగ్ పాలసీ” మరియు “చట్టవిరుద్ధంగా” చైనా భూభాగాన్ని ఆక్రమించడమేనని చైనా ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలపై స్పందించిన భారత్ డ్రాగన్‌కు గట్టిగానే సమాధానం చెప్పింది.

విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి అరిందమ్ బాగ్చి మాట్లాడుతూ, సరిహద్దు ప్రాంతాల్లో చైనా పెద్ద సంఖ్యలో సైనిక దళాలను మరియు ఆయుధాలను మోహరించిందని, చైనా చర్యకు ప్రతిస్పందనగా, భారత సాయుధ దళాలు తగిన ప్రతిఘటించాల్సి వచ్చిందని చెప్పారు. చైనా ఆరోపణలకు “ప్రాతిపదిక లేదు” అని, ద్వైపాక్షిక ఒప్పందాలు మరియు ప్రోటోకాల్‌లకు అనుగుణంగా, పూర్తిగా మిగిలిన సమస్యలను త్వరగా పరిష్కరించడానికి చైనా వైపు కృషి చేయాలని భారత్ ఆశిస్తోందని అన్నారు.

చైనా ఆరోపణలపై జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు బగ్చి స్పందిస్తూ, ఈ విషయంపై కొన్ని రోజుల క్రితం భారత్ తన వైఖరిని స్పష్టం చేసిందని, ఎలాంటి ఆధారం లేని అటువంటి ప్రకటనలను తిరస్కరించిందని అన్నారు.