CM Jagan: శ్రీకాకుళం జిల్లాకు సీఎం జగన్
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు(9 నవంబర్ 2021) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
CM Jagan: ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు(9 నవంబర్ 2021) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు. పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ కార్యక్రమంలో పాల్గొనున్నారు. శ్రీకాకుళం పర్యటన ముగించుకుని హెలికాప్టర్ ద్వారా విశాఖపట్నం విమానాశ్రయం చేరుకుని అక్కడ నుంచి ఒడిషా రాజదాని భువనేశ్వర్ వెళ్లనున్నారు సీఎం జగన్.
పాతపట్నం ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె, ఐఏఎస్ అధికారి రెడ్డి వేదిత వివాహ రిసెప్షన్ ఈరోజు పాతపట్నంలో జరగనుంది. ఈ వేడుకకు రావాలని కోరుతూ.. ఎమ్మెల్యే రెడ్డి శాంతి, ఆమె కుమారుడు రెడ్డి శ్రావణ్కుమార్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఇంతకుముందే కలిసి వివాహానికి రావాలని ఆహ్వానించారు.
సాయంత్రం 5 గంటలకు.. భువనేశ్వర్లో.. ఒడిషా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్తో సమావేశం కానున్నారు. ఉభయ రాష్ట్రాలకు చెందిన పలు అంశాలపై ముఖ్యమంత్రులు చర్చించనున్నారు. వంశధార నదిపై నేరడి వద్ద ఆనకట్ట నిర్మాణం, జంఝావతి ప్రాజెక్టు, ఆంద్రా ఓరిస్సా సరిహద్దులోని కొఠియా గ్రామాల వివాదం అంశాలు ప్రధానంగా చర్చించే అవకాశం కనిపిస్తుంది.