Film Director Nattikumar : రాజకీయాల్లోకి వస్తున్నా.. జగన్ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ చేస్తా

తనను, కొడాలి నానిని అడ్డుకోవాలని చూస్తే...ఎవరూ భయపడే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మూడు నియోజకవర్గంలో పోటీ చేస్తానని, సీఎం జగన్ ఆదేశిస్తే...

Film Director Nattikumar : రాజకీయాల్లోకి వస్తున్నా.. జగన్ ఆదేశిస్తే ఎక్కడినుంచైనా పోటీ చేస్తా

Nattikumar And Cm Jagan

Film Director Nattikumar : సినీ నిర్మాత, దర్శకుడు నట్టి కుమార్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారు. సీఎం జగన్ ఆదేశిస్తే..ఎక్కడి నుంచైనా పోటీకి దిగడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఆయన త్వరలోనే వైసీపీ కండువా కప్పుకోనున్నారని తెలుస్తోంది. స్వయంగా ఆయనే ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రతిపక్ష పార్టీల కుట్రలను ఎదుర్కోవడానికే తాను రాజకీయాల్లోకి వస్తున్నానని తెలిపారు. సీఎం జగన్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని కొంతమంది ప్రయత్నిస్తున్నారని, కొంతమంది అధికారులు మాజీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు తొత్తులుగా ఉన్నారని ఆరోపణలు గుప్పించారు. సినీ ఫీల్డ్, అధికారులు, రాజకీయ నాయకులు కలిసి కుతంత్రాలు చేస్తున్నారన్నారు. తనను, కొడాలి నానిని అడ్డుకోవాలని చూస్తే…ఎవరూ భయపడే ప్రసక్తే లేదని కుండబద్ధలు కొట్టారు. మూడు నియోజకవర్గంలో పోటీ చేస్తానని, సీఎం జగన్ ఆదేశిస్తే..ఎక్కడి నుంచైనా పోటీకి సిద్ధమని ప్రకటించారు. ఫిబ్రవరి 01వ తేదీ నుంచి ప్రజల మధ్యలో ఉంటానని తెలిపారు.

Read More : Standup Comedy : స్టాండప్ కామెడీ కాంటెస్ట్.. క్యాష్ ప్రైజ్‌తో పాటు.. కామెడీ సిరీస్‌లలో నటించే అవకాశం

నట్టి కుమార్…ఈయన ప్రముఖ నిర్మాత, దర్శకుడు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్. గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ల వివాదం కొనసాగుతున్న సంగతి తెలిసిందే. జీవో 35 విషయంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. థియేటర్లకు సంబంధించి..టికెట్ ధరలను నిర్ణయిస్తూ..ఏపీ గవర్న మెంట్ గతంలో జీవో 35ని తీసుకొచ్చిందని, ఈ జీవోని కొందరు థియేటర్ల యజమానులు ఉల్లంఘించారంటూ…ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జీవోని 35ని అమలు చేయాలంటూ హోమ్ శాఖ ప్రిన్స్ పల్ సెక్రటరీ..ఇతరులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసిందని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం నట్టి కుమార్ తీసుకున్న నిర్ణయంపై వైసీపీ ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.