Tirumala Devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ: 23 కంపార్టుమెంటుల్లో భక్తులు
సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగుతుండడంతో ఇటీవలి కాలంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఈక్రమంలోనే శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు

Tirumala Devotees: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవెంకటేశ్వర స్వామి వారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. సర్వదర్శనం టోకెన్ల జారీ కొనసాగుతుండడంతో ఇటీవలి కాలంలో స్వామి వారిని దర్శించుకునే భక్తుల సంఖ్య పెరిగింది. ఈక్రమంలోనే శుక్ర, శనివారాల్లో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకు చేరుకున్నారు. ఆదివారం ఉదయానికి వైకుంఠం క్యూ కంప్లెక్స్ లోని 23 కంపార్టుమెంటుల్లో భక్తులు నిండి ఉన్నారు. స్వామి వారి దర్శనానికి ఆరు గంటల సమయం పడుతుందని అధికారులు ప్రకటించారు. శనివారం ఒక్కరోజే 76,324 మంది భక్తులు స్వామి వారిని దర్శించుకున్నారు. ఆదివారం ఆ సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది.
Also read:Cyclone Asani: బలపడిన వాయుగుండం.. నేడు తుపానుగా మారే చాన్స్
వారాంతం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో తిరుమలకు చేరుకున్నారు. ఆంధ్ర, తెలంగాణతో పాటు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి కూడా స్వామి వారిని దర్శించుకునేందుకు భక్తులు తరలి వస్తున్నారు. శనివారం 38,710 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారు. శనివారం స్వామి వారి హుండీ ఆదాయం రూ.4.73 కోట్లు వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. మరోవైపు శ్రీవారి ఆలయంలో స్వామి వారికీ నిర్వహించే వారపు సేవలను టీటీడీ తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సమాచారం అందింది.
Also read:Tirumala Alert : తిరుమల వెళ్లే భక్తులకు ముఖ్యగమనిక.. వాటిపై నిషేధం, కొండపైకి అనుమతించరు
మంగళవారం నిర్వహించే అష్టదళ పాదపద్మారాధన సేవ, గురువారం నిర్వహించే తిరుప్పావడ, శుక్రవారం నిర్వహించే నిజపాద దర్శన సేవలను వచ్చే వారం నుంచి తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు సమాచారం. వేసవిలో భక్తుల రద్దీ దృష్ట్యా టీటీడీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పటికే పలు వారపు సేవలను శాశ్వతంగా రద్దు చేసిన టీటీడీ ఏడాదికి ఒక్కసారి మాత్రమే ఆ సేవలను చేపట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే.
- Minister RK Roja: నాది, బాలకృష్ణతో సక్సెస్ ఫుల్ కాంబినేషన్: మంత్రి ఆర్.కె.రోజా
- Payyavula Keshav On Tirumala : తిరుమలకు వెళ్లి రావాలంటే అమర్నాథ్ యాత్రకు వెళ్లి వచ్చినట్లుగా ఉంది- పయ్యావుల కేశవ్
- TTD : తిరుమలలో వీకెండ్ రష్.. దర్శన టికెట్ల కోసం భారీ రద్దీ
- Tirumala Temple: ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి ఆర్జిత సేవలు పునఃప్రారంభం: ఆన్లైన్లో టికెట్లు
- Tirumala Devotees : తిరుమలకు పోటెత్తిన భక్తులు.. రెండేళ్ల తర్వాత ఇదే..
1George W. Bush : అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జ్ డబ్ల్యూ బుష్ హత్యకు కుట్ర
2CM KCR: నేడు బెంగళూరుకు సీఎం కేసీఆర్.. ఎవరెవరితో భేటీ అవుతారంటే..
3Pm modi: నేడు రాష్ట్రానికి ప్రధాని మోదీ.. రెండున్నర గంటలు పర్యటన.. షెడ్యూల్ ఇలా..
4Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
5Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
6McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
7VVS Laxman: టీమిండియా కోచ్గా వీవీఎస్ లక్ష్మణ్
8Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
9CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
10TSRTC : హైదరాబాద్లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
-
Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?