Nagarjuna- Jr NTR: సీఎం జగన్తో భేటికి నాగార్జున, ఎన్టీఆర్ గైర్హాజరు.. కారణం ఏంటంటే?
సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు సినిమా ప్రముఖులంతా చిరంజీవితో పాటు అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్ పలువురు దర్శకులు, నిర్మాతలు సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు.
Nagarjuna, Jr NTR: సినిమా ఇండస్ట్రీ సమస్యలపై మాట్లాడేందుకు సినిమా ప్రముఖులంతా చిరంజీవితో పాటు అగ్రహీరోలు మహేష్ బాబు, ప్రభాస్ పలువురు దర్శకులు, నిర్మాతలు సీఎం జగన్ను కలిసేందుకు వెళ్లారు.
మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంకు చేరుకుని ముఖ్యమంత్రి జగన్తో భేటి అయ్యారు. అయితే, ఈ సమావేశానికి ఆఖరి నిమిషంలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్లు గైర్హాజరయ్యారు.
ఈ సమావేశంలో నాగార్జున, జూనియర్ ఎన్టీఆర్ పాల్గొనకపోవడం హాట్టాపిక్గా మారగా.. సీఎం జగన్ను కలిసేందుకు నాగార్జున రాకపోవడానికి కారణం అమల అని తెలుస్తోంది. అక్కినేని అమలకు కరోనా పాజిటివ్ రాగా.. హోం క్వారంటైన్లోకి వెళ్లారు నాగార్జున.
ఈ కారణంగానే సమావేశానికి దూరంగా ఉన్నట్లు చెబుతున్నారు. అయితే, తారక్ మాత్రం వ్యక్తిగత కారణాల వల్లే రాలేకపోతున్నట్లు చెప్పినట్లుగా సమాచారం. ఇదిలా ఉంటే ఈరోజు సినిమా టిక్కెట్ల సమస్యకు పరిష్కారం లభిస్తుంది అని భావిస్తున్నారు.