ఏపీలో కొత్తగా 439 కరోనా కేసులు.. జిల్లాలవారీగా లెక్కలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు రోజురోజుకు విపరీతంగా పెరిగిపోతున్నాయి. గత 24 గంటల్లో 24,451 శాంపిళ్లను పరీక్షించగా మరో 439 మందికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది.
ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 24 గంటల్లో 151 మంది కరోనా నుంచి కోలుకున్నారు.
రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసులు 7,059కు చేరుకోగా.. ఏపీలో చికిత్స తీసుకుంటున్న ఇతర రాష్ట్రాలు, దేశాల వారితో కలిపి మొత్తం 8,929 కేసులు నమోదయ్యాయి.
ప్రస్తుతం ఆసుపత్రుల్లో కరోనాకు 3,599 మంది చికిత్స పొందుతుండగా, ఇప్పటివరకు 3,354 మంది డిశ్చార్జ్ అయ్యారు. మృతుల సంఖ్య మొత్తం 106గా ఉంది.
జిల్లాలవారీగా రాష్ట్రంలో నమోదైన కేసులు..
#COVIDUpdates: 21/06/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 7059 పాజిటివ్ కేసు లకు గాను
*3354 మంది డిశ్చార్జ్ కాగా
*106 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 3599#APFightsCorona #COVID19Pandemic pic.twitter.com/lRJWN83XGy— ArogyaAndhra (@ArogyaAndhra) June 21, 2020