AP CID : చంద్రబాబు ఐటీ స్కామ్‌లో ట్విస్ట్.. రంగంలోకి ఏపీ సీఐడీ, త్వరలో దుబాయ్‌కు విచారణ బృందం

రెండు స్కాముల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాఫ్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కామ్ లో ఉన్న వారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది. AP CID - Chandrababu Naidu

AP CID : చంద్రబాబు ఐటీ స్కామ్‌లో ట్విస్ట్.. రంగంలోకి ఏపీ సీఐడీ, త్వరలో దుబాయ్‌కు విచారణ బృందం

AP CID - Chandrababu Naidu

AP CID – Chandrababu Naidu : చంద్రబాబు ఐటీ స్కామ్ పై ఏపీ సీఐడీ రంగంలోకి దిగింది. ఐటీ స్కామ్, స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో మూలాలు ఒకేచోట ఉన్నాయన్న దానిపై విచారణకు సిద్ధమైంది. రెండు స్కామ్ లలో ఒకే వ్యక్తులు ఉండటంపై విచారణకు సిద్ధమైంది. ఐటీ స్కామ్ లో కీలక వ్యక్తి మనోజ్ వాసుదేవ్ పార్దసాని , స్కిల్ డెవలప్ మెంట్ స్కామ్ లో నిందితుడు యోగేశ్ గుప్తాకు ఏపీ సీఐడీ నోటీసులు జారీ చేసింది. వీరిద్దరినీ సీఐడీ అధికారులు విచారించనున్నారు.

టిడ్కో ఇళ్ల నిర్మాణంలో రేట్లు పెంచి కంపెనీల నుంచి ముడుపులు స్వీకరించారంటూ ఇప్పటికే అభియోగాలు ఉన్నాయి. నాలుగేళ్లుగా ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాఫ్తు సంస్థ ఐటీ శాఖ విచారణ జరుపుతోంది. స్కిల్ స్కామ్ లోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారంటూ ఆరోపణలు చేసింది. రెండు స్కామ్ లలో భారీగా డబ్బు అందుకున్నట్లు చంద్రబాబు పీఏ శ్రీనివాస్ పై అభియోగాలు మోపింది. రెండు స్కాముల్లోనూ డబ్బు చేరింది ఒక్కరికే అని దర్యాఫ్తు సంస్థలు అంటున్నాయి. దీంతో ఈ స్కామ్ లో ఉన్న వారి మధ్య సంబంధాలపై సీఐడీ దృష్టి సారించింది.

Also Read..Minister Roja : రెండు ఎకరాల చంద్రబాబు రెండు వేల కోట్ల రూపాయలు ఎలా సంపాదించాడు : మంత్రి రోజా

దుబాయ్ లోనూ చంద్రబాబు డబ్బులు అందుకున్నట్లుగా అభియోగాలు ఉండటంతో దీనిపైనా దృష్టి పెట్టనుంది. త్వరలో దుబాయ్ కి విచారణ బృందం వెళ్లనున్నట్లు తెలుస్తోంది.