Nightmare insects : గుంటూరు జిల్లాలో వింత పురుగులు.. దురద, దద్దుర్లు.. జనాల్లో టెన్షన్…

గుంటూరు జిల్లాలో వింత పురుగులు కలకలం రేపుతున్నాయి.. రొంపిచర్ల మండలంలో పలు గ్రామాల్లో ఈ పురుగులు సంచరిస్తున్నాయి.

Nightmare insects : గుంటూరు జిల్లాలో వింత పురుగులు.. దురద, దద్దుర్లు.. జనాల్లో టెన్షన్…

Insects Bite Guntur District People

Nightmare insects in Guntur district : గుంటూరు జిల్లాలో వింత పురుగులు కలకలం రేపుతున్నాయి.. రొంపిచర్ల మండలంలో పలు గ్రామాల్లో ఈ పురుగులు సంచరిస్తున్నాయి. ఆ పురుగులు ఒంటిపై వాలినా.. కుట్టినా దురదలు, దద్దుర్లు వస్తున్నాయని వీరవట్నం సుబ్బయ్యపాలెం, విప్పర్లపల్లి గ్రామాల్లో ప్రజలు చెబుతున్నారు. అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. వెంటనే దీనికి సంబంధించిన అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

ఈ పురుగుల దెబ్బకు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సుబాబుల్ తోటల వల్లే పురుగులు వచ్చాయని స్థానికులు చెబుతున్నారు.. గతంలో ఎప్పుడూ ఇలాంటి వాటిని చూడలేదని రైతులు కూడా చెబుతున్నారు. ఈ పురుగులు ఏంటి, ఎక్కడ్నుంచి వచ్చాయన్న అంశంపై అధికారులు ఆరా తీస్తున్నారు. గ్రామాల్లో తిరుగుతున్న ఆ పురుగుల్ని పరిశీలిస్తున్నారు.