Pawan Kalyan : 13న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న పవన్ కల్యాణ్

 జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలవనున్నారు. సోమవారం (మార్చి13,2023) సాయంత్రం 5గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పవన్ కల్యాణ్ కలవనున్నారు.

Pawan Kalyan : 13న ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్‌ను కలవనున్న పవన్ కల్యాణ్

Pawan Kalyan will meet AP Governor Abdul Nazeer on March 13th

Pawan Kalyan : జనసేన అధినేత పవన్ కల్యాన్ ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ను కలవనున్నారు. సోమవారం (మార్చి13,2023) సాయంత్రం 5గంటలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ను పవన్ కల్యాణ్ కలవనున్నారు. ఏపీ గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తరువాత అబ్దుల్ నజీర్‌ను పవన్ కల్యాణ్ మర్యాదపూర్వకంగా కలవనున్నారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్‌గా అబ్దుల్ నజీర్ ఫిబ్రవరి 24న ప్రమాణం చేశారు. విజయవాడలోని రాజ్‌భవన్‌లో ఏపీ హైకోర్టు చీఫ్ జస్టిస్ ప్రశాంత్‌కుమార్ మిశ్రా గవర్నర్ అబ్దుల్ నజీర్‌తో ప్రమాణం చేయించారు. సుప్రీంకోర్టు జస్టిస్‌గా పనిచేసిన అబ్దుల్ నజీర్‌ను ఏపీ రాష్ట్రానికి గవర్నర్ నియమితులయ్యారు. అయోధ్య, ట్రిపుల్ తలాక్, నోట్ల రద్దు వంటి కీలక అంశాలతో పాటు పలు కీలక కేసుల తీర్పులను వెలువరించిన ఘతన అబ్దుల్ నజీర్‌కు ఉంది.

గెలుపే లక్ష్యంగా పవన్ అడుగులు..వరుస కార్యక్రమాలతో బిజీ బిజీ 
కాగా గత ఎన్నికల్లో ఘోరంగా ఓటమిపాలైన జనసేన 2024లో సత్తా చాటాలని భావిస్తోంది. దీని కోసం జనసేన ఇప్పటికే ఎన్నికల ప్రచారం రథంగా ‘వారాహి’ని సిద్ధం చేసుకున్నారు. ఈక్రమంలో రేపటి నుంచి వరుస కార్యక్రమాలతో బిజీ బిజీగా గడపనున్నారు. వైసీపీ ఓటమేలక్ష్యంగా పవన్ పనిచేస్తున్నారు. దీని కోసం ఇప్పటినుంచే ప్రజల బలం పెంచుకోవడానికి ప్రయత్నం చేస్తున్న పవన్ కళ్యాణ్ ఈనెల 14న జనసేన పార్టీ ఆవిర్భావ సభను కృష్ణాజిల్లా మచిలీపట్నంలో నిర్వహించడానికి రెడీ అయ్యారు. వారాహి వాహనంలో మచిలీపట్నం వెళ్లనున్న పవన్ కళ్యాణ్ మచిలీపట్నం సభ ద్వారా పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేస్తారని సమాచారం. జనసేన నేతలకు, కార్యకర్తలకు వచ్చే ఎన్నికలకు దిశా నిర్దేశం చేస్తారని జనసేన పార్టీ నేతలు, కార్యకర్తలు భావిస్తున్నారు.

వారాహి వాహనంలో మచిలీపట్నానికి జనసేనాని పయనం
గతంలో ఇప్పటం సభకు ఇచ్చినట్టే 100 ఎకరాల భూమిని సభ నిర్వహణ కోసం మచిలీపట్నం రైతులు ఇచ్చారు. ఇక ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో రాష్ట్ర ప్రజలందరి దృష్టిని ఆకట్టుకోవడానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ఈ సభను వేదికగా చేసుకోనున్నారు. వారాహి వాహనంలో మచిలీపట్నానికి వెళ్ళనున్నారు. ఏపీలో పవన్ పర్యటన షెడ్యూల్ ఇలా ఇదిలా ఉంటే పవన్ కళ్యాణ్ పార్టీ అయిన జనసేన ఆవిర్భావ సభ నేపథ్యంలో ఇప్పటికే సభ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి.

బీసీ నేతలతో జనసేనాని సమావేశం..
కాగా పవన్ కళ్యాణ్ రేపటినుండి వరుసగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ కార్యక్రమాలలో పాల్గొననున్నారు. ఇక జనసేనాని పవన్ కళ్యాణ్ షెడ్యూల్ వివరాల్లోకి వెళితే ఈనెల 11వ తేదీన పవన్ కళ్యాణ్ మంగళగిరి పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసే బీసీ సదస్సులో పాల్గొంటారు. ఈనెల 12వ తేదీన కాపు ఉద్యమ నేత హరి రామ జోగయ్య, కాపు నేతలు పవన్ కళ్యాణ్ ను కలిసి మాట్లాడనున్నారు.